ETV Bharat / state

రైతు దాతృత్వం: రైతు వేదిక నిర్మాణం కోసం పొలం విరాళం

author img

By

Published : Jul 11, 2020, 10:15 PM IST

సంగారెడ్డి జిల్లా కంగ్టి రైతుల బాగుకై నిర్మించ తలపెట్టిన రైతువేదిక నిర్మాణం కోసం ఓ రైతు అర ఎకరం పొలం విరాళంగా ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అతన్ని మంత్రి హరీశ్​రావు అభినందించగా.. కలెక్టర్​ హనుమంతరావు సన్మానించారు.

collector hanumantha rao honored a farmer in sangareddy
రైతు దాతృత్వం: రైతు వేదిక నిర్మాణం కోసం పొలం విరాళం

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని రామతిర్త్ గ్రామంలో విఠల్​ అనే రైతు పెద్దమనసుతో రైతు వేదిక నిర్మాణం కోసం అర ఎకరం స్థలం విరాళంగా ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్​ హనుమంతరావు విఠల్​ను సన్మానించారు.

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు రైతుతో ఫోన్​లో మాట్లాడి అతన్ని అభినందించారు. ఆయనలాంటి రైతులను ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తన విలువైన స్థలాన్ని తోటి రైతుల ఉపయోగం కోసం ఇవ్వడం ఆదర్శనీయమన్నారు.

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని రామతిర్త్ గ్రామంలో విఠల్​ అనే రైతు పెద్దమనసుతో రైతు వేదిక నిర్మాణం కోసం అర ఎకరం స్థలం విరాళంగా ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్​ హనుమంతరావు విఠల్​ను సన్మానించారు.

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు రైతుతో ఫోన్​లో మాట్లాడి అతన్ని అభినందించారు. ఆయనలాంటి రైతులను ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తన విలువైన స్థలాన్ని తోటి రైతుల ఉపయోగం కోసం ఇవ్వడం ఆదర్శనీయమన్నారు.

ఇవీ చూడండి: సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.