రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతంలో పట్టణంలో రెండు కేసులు నమోదు కాగా... ఈశ్వర్ కాలనీకి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతని కుటుంబంలోనే ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమై... పట్టణంలో నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 66 కరోనా పాజిటివ్ కేసులు