గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకుండల్లా మారాయి. ఈ క్రమంలో హైదరాబాద్ శివారులోని హిమాయత్సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. నిన్నటి వరకు ఎక్కువగా ఉన్న ఇన్ఫ్లో.. నేడు తగ్గుముఖం పట్టింది.

హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1759.014 అడుగులుగా ఉంది. ఈ క్రమంలో మూసీ పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు కమ్యూనిటీ హాళ్లకు తరలించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.