ETV Bharat / state

నిందితులపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం - నిందితులపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం

తీవ్ర ఉద్రిక్తతల నడుమ శంషాబాద్‌ పశువైద్యురాలి హత్యాచార నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. షాద్‌నగర్ పీఎస్ ఎదుట స్థానికులు శనివారం తీవ్ర ఆందోళన చేశారు. నిందితులను బహిరంగంగా శిక్షించాలనే డిమాండ్‌తో 8 గంటలపాటు ఆందోళన నిర్వహించారు. దీంతో నిందితులకు వైద్య పరీక్షలతో పాటు... విచారణ కూడా పోలీస్ స్టేషన్ లోనే నిర్వహించారు.

నిందితులపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం
నిందితులపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం
author img

By

Published : Dec 1, 2019, 5:26 AM IST

Updated : Dec 1, 2019, 9:17 AM IST

నిందితులపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం

శంషాబాద్ పశు వైద్యురాలి హత్యాచారం కేసులో నిందితులను షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ నుంచి జైలుకు తీసుకెళ్లే క్రమంలో స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. నలుగురు నిందితులు షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారన్న విషయం తెలుసుకున్న స్థానికులు శనివారం ఉదయం 9 గంటలకే అక్కడికి చేరుకున్నారు. షాద్‌నగర్ పట్టణంతో పాటు... చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వాళ్లు వేల సంఖ్యలో వచ్చారు. పోలీస్ స్టేషన్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు సైతం ఎత్తి కింద పడేశారు. పోలీసుల పైకి చెప్పులు కూడా రువ్వారు.

ఉద్రిక్తల నడుమ నిందితులను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లడం మంచిది కాదని భావించిన పోలీసులు వైద్యులను పోలీస్ స్టేషన్​కు తీసుకొచ్చారు. షాద్ నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యులు వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు నివేదించారు. షాద్‌నగర్ న్యాయస్థానంలో న్యాయమూర్తులు అందుబాటులో లేకపోవడం వల్ల మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అయిన షాద్‌నగర్ తహసీల్దార్ ఎదుట ప్రవేశపెట్టాలని భావించారు. స్టేషన్‌కు వచ్చిన తహసీల్దార్ నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు.

నలుగురు నిందితులను వాస్తవానికి మహబూబ్ నగర్ జిల్లా జైలుకు తరలించాల్సి ఉన్నా... పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి జైలుకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య ఆరు వాహనాల శ్రేణిలో నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. వాహనాలు పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆందోళనకారులు చెప్పులు, రాళ్లు విసిరారు. పోలీసులు మరోసారి ఆందోళనకారులను చెదరగొడుతూ వాహనాలను హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు.

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానికులు అక్కడే ఉండి ఆందోళన చేశారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి నలుగురు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలతో పాటు షాద్‌నగర్ సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు పోలీస్ స్టేషన్ ఎదుటే ఉన్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులతో పాటు అదనపు బలగాలను పోలీస్ స్టేషన్ ఎదుట బందోబస్తు నిర్వహించారు.

ఇవీ చూడండి: శంషాబాద్​ నిందితులను పట్టించిన ఫోన్​ కాల్​

నిందితులపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం

శంషాబాద్ పశు వైద్యురాలి హత్యాచారం కేసులో నిందితులను షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ నుంచి జైలుకు తీసుకెళ్లే క్రమంలో స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. నలుగురు నిందితులు షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారన్న విషయం తెలుసుకున్న స్థానికులు శనివారం ఉదయం 9 గంటలకే అక్కడికి చేరుకున్నారు. షాద్‌నగర్ పట్టణంతో పాటు... చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వాళ్లు వేల సంఖ్యలో వచ్చారు. పోలీస్ స్టేషన్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు సైతం ఎత్తి కింద పడేశారు. పోలీసుల పైకి చెప్పులు కూడా రువ్వారు.

ఉద్రిక్తల నడుమ నిందితులను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లడం మంచిది కాదని భావించిన పోలీసులు వైద్యులను పోలీస్ స్టేషన్​కు తీసుకొచ్చారు. షాద్ నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యులు వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు నివేదించారు. షాద్‌నగర్ న్యాయస్థానంలో న్యాయమూర్తులు అందుబాటులో లేకపోవడం వల్ల మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అయిన షాద్‌నగర్ తహసీల్దార్ ఎదుట ప్రవేశపెట్టాలని భావించారు. స్టేషన్‌కు వచ్చిన తహసీల్దార్ నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు.

నలుగురు నిందితులను వాస్తవానికి మహబూబ్ నగర్ జిల్లా జైలుకు తరలించాల్సి ఉన్నా... పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి జైలుకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య ఆరు వాహనాల శ్రేణిలో నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. వాహనాలు పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆందోళనకారులు చెప్పులు, రాళ్లు విసిరారు. పోలీసులు మరోసారి ఆందోళనకారులను చెదరగొడుతూ వాహనాలను హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు.

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానికులు అక్కడే ఉండి ఆందోళన చేశారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి నలుగురు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలతో పాటు షాద్‌నగర్ సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు పోలీస్ స్టేషన్ ఎదుటే ఉన్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులతో పాటు అదనపు బలగాలను పోలీస్ స్టేషన్ ఎదుట బందోబస్తు నిర్వహించారు.

ఇవీ చూడండి: శంషాబాద్​ నిందితులను పట్టించిన ఫోన్​ కాల్​

TG_HYD_09_01_SERIOUS_PUBLIC_PKG_3181326_ 3181965 రిపోర్టర్-శ్రీకాంత్, ప్రవీణ్ ( ) ఉద్రిక్తల నడుమ నలుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. షాద్ నగర్ పీఎస్ ఎదుట స్థానికులు తీవ్ర ఆందోళన చేశారు. నిందితులను బహిరంగంగా శిక్షించాలనే డిమాండ్ తో 8 గంటలపాటు ఆందోళన నిర్వహించారు. దీంతో నిందితులకు వైద్య పరీక్షలతో పాటు... విచారణ కూడా పోలీస్ స్టేషన్ లోనే నిర్వహించారు. వైద్యులు, మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కూడా పోలీస్ స్టేషన్ కే వచ్చారు......LOOK V.O- శంషాబాద్ యువతి హత్యాచారం కేసులో నిందితులు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి జైలుకు తీసుకెళ్లే క్రమంలో స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. నిందితులను బహిరంగంగా శిక్షించాలని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, స్థానికులు డిమాండ్ చేశారు. నలుగురు నిందితులు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారన్న విషయం తెలుసుకున్న స్థానికులు శనివారం ఉదయం 9 గంటలకే అక్కడికి చేరుకున్నారు. షాద్ నగర్ పట్టణంతో పాటు... చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వాళ్లు వేల సంఖ్యలో వచ్చారు. పోలీస్ స్టేషన్ లో దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడానికి ఆపసోపాలు పడాల్సి వచ్చింది. తాడు సాయంతో అడ్డుకునే ప్రయత్నం చేసినా... వాళ్లు దాన్ని తొలగించుకొని పీఎస్ ప్రధాన గేటు వద్దకు తోసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ గేటుకు తాళం కూడా వేశారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. బారికేడ్లు ఎత్తి కింద పడేశారు. పోలీసుల పైకి చెప్పులు కూడా రువ్వారు. దీంతో పోలీసులు ఆందోళనకారులని చెదరగొట్టారు. పరిస్థితిని అదుపు చేయడానికి నాలుగు సార్లు లాఠీలు ఝులిపించారు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. అయినా ఆందోళనకారులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నిందితులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలు, విద్యార్థినిలు కూడా అక్కడి వచ్చి రోడ్డుపై బైఠాయించి నిరసనను తెలియజేశారు. V.O- ఉద్రిక్తల నడుమ నిందితులను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లడం మంచిది కాదని భావించిన పోలీసులు వైద్యులను పోలీస్ స్టేషన్ కే తీసుకొచ్చారు. షాద్ నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యులు నిందితుల శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితి పరీక్షించారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు నివేదించారు. షాద్ నగర్ న్యాయస్థానంలో న్యాయమూర్తులు అందుబాటులో లేకపోవడంతో మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అయిన షాద్ నగర్ తహసీల్దార్ ఎదుట ప్రవేశపెట్టాలని భావించారు. కానీ తహసీల్దాన్ పాండు నాయక్ ను కూడా పోలీస్ స్టేషన్ కే పిలిపించారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పాండు నాయక్ రిమాండ్ రిపోర్టును పరిశీలించి నిందితులను 14 రోజుల రిమాండ్ విధించారు. నలుగురు నిందితులను ఎక్కడికి తీసుకెల్లేది పోలీసులు రహస్యంగా ఉంచారు. వాస్తవానికి మహబూబ్ నగర్ జిల్లా జైలుకు తరలించాల్సి ఉన్న.. పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి జైలుకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య ఆరు వాహనాల శ్రేణిలో నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. వాహనాలు పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆందోళనకారులు చెప్పులు, రాళ్లు విసిరారు. పోలీసులు మరోసారి ఆందోళనకారులను చెదరగొడుతూ వాహనాలు హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు. E.V.O- ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానికులు అక్కడే ఉండి ఆందోళన చేశారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి నలుగురు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలతో పాటు షాద్ నగర్ సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు పోలీస్ స్టేషన్ ఎదుటే ఉన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు అదనపు బలగాలను పోలీస్ స్టేషన్ ఎదుట బందోబస్తు నిర్వహించారు. నోట్- 3జీ నుంచి వచ్చిన ఫీడ్ వాడుకోగలరు
Last Updated : Dec 1, 2019, 9:17 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.