చేవెళ్లలో దారుణ హత్యకు గురైన యువతి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లకు సమాచారమిచ్చిన పోలీసులు... యువతి ఆచూకీ తెలపాలంటూ ప్రకటన విడుదల చేశారు. యువతి ఫొటో, ఆమెకు చెందిన వస్తువుల దృశ్యాలను విడుదల చేశారు. యువతిని గుర్తించిన వాళ్లు సమాచారమివ్వాల్సిందిగా చేవేళ్ల పోలీసులు కోరారు.
చేవెళ్ల ఏసీపీ, సీఐ, ఎస్సై లేదా ఠాణాకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో శవపరీక్ష నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని భద్రపరిచారు. యువతి వివరాలు తెలిస్తే కేసులో పురోగతి లభించే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.