రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో తొలి కరోనా కేసు నమోదైంది. పట్టణంలోని ఓ యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు సమాచారం తెలిసింది. వెంటనే ఆరోగ్య సిబ్బంది అతనిని గురువారం హైదరాబాద్లోని కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు.
శుక్రవారం పరీక్షల అనంతరం అతనికి పాజిటివ్ అని తెలింది. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. బాధితుని కుటుంబ సభ్యులను క్వారైంటైన్కు తీసుకెళ్లారు.
ఇదీ చూడండి : నాడు ఉచిత వైద్యం చేశాడు.. నేడు వైద్యం కోసం ఎదురుచూస్తున్నాడు!