రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని దానమ్మ దోపిడీ వద్దనున్న ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. గోదాం నుంచి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారాన్ని అందించారు.
వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బంది 5 అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణం వల్లే మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ గోదాంకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని ఇలాంటివి చుట్టుపక్కల చాలా గోదాంలు ఉన్నాయని స్థానికులు అసహనం వ్యక్తం చేశారు.