ETV Bharat / state

Chinna Jeeyar Swamy: స్థిరాస్తి సంస్థ భూమి పూజలో పాల్గొన్న చినజీయర్ స్వామి

author img

By

Published : Dec 6, 2021, 7:46 PM IST

Chinna Jeeyar Swamy: స్థిరాస్తి సంస్థ భూమి పూజలో త్రిదండి చిన జీయర్ స్వామి పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్​పేట్ పరిధిలోని తట్టిఅన్నారంలో ఏస్ అనంత వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేపడుతున్న విల్లాస్ ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Chinna Jeeyar Swamy in bhoomi pooja
స్థిరాస్తి సంస్థ భూమి పూజలో త్రిదండి చిన్న జీయర్ స్వామి

Chinna Jeeyar Swamy: స్థిరాస్తి సంస్థ ఏస్​ అనంత వెంచర్స్​ ప్రైవేట్ లిమిటెడ్ భూమి పూజ కార్యక్రమంలో త్రిదండి చిన జీయర్ స్వామిజీ పాల్గొన్నారు. అనంతరం మహా సుదర్శన యాగంలో పాల్గొని ఆధ్యాత్మికతపై ప్రవచనాలు వినిపించారు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్​పేట్ పురపాలిక పరిధిలోని తట్టిఅన్నారంలో నిర్మిస్తున్న విల్లాస్ ప్రాజెక్ట్​ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

Bhoomi pooja: దాదాపు పద్నాలుగు ఎకరాల్లో 127 విల్లాలు నిర్మిస్తున్నామని ఏస్​ అనంత వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్రీకాంత్ తెలిపారు. ఈ వెంచర్ భూమి పూజకు చిన జీయర్ స్వామి హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. గతంలో అజంతా ప్రాజెక్ట్​ను విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయబోతున్న విల్లాలను నగర వాసులు అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. అన్ని రకాల సౌకర్యాలతో అద్భుతమైన ప్రాజెక్ట్​ను నిర్మిస్తామని ఎండీ శ్రీకాంత్ వెల్లడించారు.

భూమి పూజలో త్రిదండి చిన జీయర్ స్వామి

Chinna Jeeyar Swamy: స్థిరాస్తి సంస్థ ఏస్​ అనంత వెంచర్స్​ ప్రైవేట్ లిమిటెడ్ భూమి పూజ కార్యక్రమంలో త్రిదండి చిన జీయర్ స్వామిజీ పాల్గొన్నారు. అనంతరం మహా సుదర్శన యాగంలో పాల్గొని ఆధ్యాత్మికతపై ప్రవచనాలు వినిపించారు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్​పేట్ పురపాలిక పరిధిలోని తట్టిఅన్నారంలో నిర్మిస్తున్న విల్లాస్ ప్రాజెక్ట్​ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

Bhoomi pooja: దాదాపు పద్నాలుగు ఎకరాల్లో 127 విల్లాలు నిర్మిస్తున్నామని ఏస్​ అనంత వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్రీకాంత్ తెలిపారు. ఈ వెంచర్ భూమి పూజకు చిన జీయర్ స్వామి హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. గతంలో అజంతా ప్రాజెక్ట్​ను విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయబోతున్న విల్లాలను నగర వాసులు అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. అన్ని రకాల సౌకర్యాలతో అద్భుతమైన ప్రాజెక్ట్​ను నిర్మిస్తామని ఎండీ శ్రీకాంత్ వెల్లడించారు.

భూమి పూజలో త్రిదండి చిన జీయర్ స్వామి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.