చిన జీయర్ ఆశ్రమంలో క్యాన్సర్ దినోత్సవ నిర్వహణ మహిళలకు కుటుంబంలో ప్రత్యేక స్థానం ఉంటుందని శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల గ్రామంలోని ఆశ్రమంలో హోమియోపతి కళాశాలలో క్యాన్సర్ దినోత్సవం నిర్వహించారు. అతివలు వస్త్రాలు, ఆభరణాలపై చూపించే శ్రద్ధ ఆరోగ్యంపై చూపించరని పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతకం కాదని.. మొదటి దశలోనే గుర్తిస్తే నివారించవచ్చని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమానికి హాజరైన వైద్యులను స్వామీజీ సత్కరించారు. ఒమేగా ఆసుపత్రి సీనియర్ వైద్యులు వంశీ మోహన్ క్యాన్సర్ నివారణ మార్గాలపై సూచనలు చేశారు.