ETV Bharat / state

Musi: మూసీనది ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

author img

By

Published : Jun 28, 2021, 5:32 PM IST

మూసీనదీ పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అనంతరం ఆ భూమి ప్రభుత్వానికి సంబంధించిందని తెలియజేస్తూ.. ఓ సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Authorities demolish illegal structures in the Musi River catchment area
అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా

రాజేంద్రనగర్ పరిధి హైదర్​గూడా మూసీనది పరివాహక ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝులిపించారు. ఆర్​డీఓ చంద్రకళ ఆదేశాలతో రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ తహసీల్దార్​ దగ్గరుండి అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేయించారు. అనంతరం ఆ భూమి ప్రభుత్వానికి సంబంధించిందని తెలియజేస్తూ.. ఓ సూచిక బోర్డును ఏర్పాటు చేశారు.

మూసీనది పరివాహక ప్రాంతాల్లో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించామని ఎమ్మార్వో చంద్రశేఖర్​ గౌడ్ తెలిపారు. మరోమారు ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మూసి నదిలో మట్టిపోసి పూడుస్తున్న ఓ లారీని రెవెన్యూ అధికారులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

భారీ ప్రణాళికతో...

మొదట రెండెకరాల భూమిని కబ్జా చేసిన అక్రమార్కులు మరో ఐదెకరాల భూమిని కబ్జా చేసి మొత్తం ఏకకాలంలో రియల్ వెంచర్ వేసి అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. మూసీనదిని పూర్తిగా చదును చేసిన తర్వాత రాజకీయ నాయకుల అండ తీసుకోవాలని భావించారు. ఈ వ్యవహారంపై "కళ్లు మూసుకున్నారా?" అనే శీర్షకతో ఈటీవీ భారత్ కథనం ప్రచురించడంతో అధికారులు స్పందించారు. కబ్జాపై పూర్తి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేశారు.

ఇదీ చదవండి: ఈటీవీ భారత్ కథనంతో మూసీ నది కబ్జాకు అడ్డుకట్ట

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా

రాజేంద్రనగర్ పరిధి హైదర్​గూడా మూసీనది పరివాహక ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝులిపించారు. ఆర్​డీఓ చంద్రకళ ఆదేశాలతో రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ తహసీల్దార్​ దగ్గరుండి అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేయించారు. అనంతరం ఆ భూమి ప్రభుత్వానికి సంబంధించిందని తెలియజేస్తూ.. ఓ సూచిక బోర్డును ఏర్పాటు చేశారు.

మూసీనది పరివాహక ప్రాంతాల్లో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించామని ఎమ్మార్వో చంద్రశేఖర్​ గౌడ్ తెలిపారు. మరోమారు ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మూసి నదిలో మట్టిపోసి పూడుస్తున్న ఓ లారీని రెవెన్యూ అధికారులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

భారీ ప్రణాళికతో...

మొదట రెండెకరాల భూమిని కబ్జా చేసిన అక్రమార్కులు మరో ఐదెకరాల భూమిని కబ్జా చేసి మొత్తం ఏకకాలంలో రియల్ వెంచర్ వేసి అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. మూసీనదిని పూర్తిగా చదును చేసిన తర్వాత రాజకీయ నాయకుల అండ తీసుకోవాలని భావించారు. ఈ వ్యవహారంపై "కళ్లు మూసుకున్నారా?" అనే శీర్షకతో ఈటీవీ భారత్ కథనం ప్రచురించడంతో అధికారులు స్పందించారు. కబ్జాపై పూర్తి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేశారు.

ఇదీ చదవండి: ఈటీవీ భారత్ కథనంతో మూసీ నది కబ్జాకు అడ్డుకట్ట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.