ETV Bharat / state

CVR 2K22 Fest: సీవీఆర్​ కళాశాలలో ఘనంగా 2K22 ఫెస్ట్ - Telangana news

CVR 2k22 Fest: రంగారెడ్డి జిల్లా మంగళ్​పల్లిలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో 2k22 ఫెస్ట్ ఇవాళ ప్రారంభమైంది. ఈ ఫెస్ట్ రెండు రోజుల పాటు జరగనుంది. ఈ టెక్నికల్ ఫెస్ట్​లో విద్యార్థులు రూపొందించిన పేపర్ ప్రజెంటేషన్, ప్రాజెక్టు ఎక్స్​పో, ఆటో ఎక్స్​పో ఆకట్టుకున్నాయి.

CVR
CVR
author img

By

Published : Apr 12, 2022, 5:50 PM IST

Updated : Apr 12, 2022, 6:09 PM IST

CVR 2K22 Fest: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి మంగళ్​పల్లిలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్ట్ సీఎంసీయూ 2K22 ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజులపాటు ఈ టెక్నికల్ ఫెస్ట్ జరుగనుంది. విద్యార్థులు ఏర్పాటు చేసిన పేపర్ ప్రజెంటేషన్, ప్రాజెక్టు ఎక్స్​పో, ఆటో ఎక్స్​పో ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏరోస్పేస్, కార్పొరేట్ ప్లానింగ్ ఈసీఐఎల్ డాక్టర్ బ్రజా బి నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Technical
ఫెస్ట్​ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది

విద్యార్థులు చదువుతో పాటు అనేక రంగాల్లో ముందుండాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా పారిశ్రామిక, వైమానిక, సాంకేతిక రంగాలపై దృష్టి సారించాలని సూచించారు. వైద్య, డిజిటల్ రంగాలలో భారతదేశం ముందుకు దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నయనతార, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఫెస్ట్​లో విద్యార్థులు వివిధ విభాగాల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. స్మాల్ రోబోస్, త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీస్, నీటి పునర్వినియోగం వంటి అంశాలపై విద్యార్థులు తయారుచేసిన ప్రజెంటేషన్స్ ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఫెస్ట్​లో సామాజిక అంశాలపై కూడా అవగాహన కల్పించారు.

సీవీఆర్​ కళాశాలలో ఘనంగా 2k22 ఫెస్ట్

ఇదీ చూడండి:

CVR 2K22 Fest: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి మంగళ్​పల్లిలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్ట్ సీఎంసీయూ 2K22 ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజులపాటు ఈ టెక్నికల్ ఫెస్ట్ జరుగనుంది. విద్యార్థులు ఏర్పాటు చేసిన పేపర్ ప్రజెంటేషన్, ప్రాజెక్టు ఎక్స్​పో, ఆటో ఎక్స్​పో ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏరోస్పేస్, కార్పొరేట్ ప్లానింగ్ ఈసీఐఎల్ డాక్టర్ బ్రజా బి నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Technical
ఫెస్ట్​ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది

విద్యార్థులు చదువుతో పాటు అనేక రంగాల్లో ముందుండాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా పారిశ్రామిక, వైమానిక, సాంకేతిక రంగాలపై దృష్టి సారించాలని సూచించారు. వైద్య, డిజిటల్ రంగాలలో భారతదేశం ముందుకు దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నయనతార, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఫెస్ట్​లో విద్యార్థులు వివిధ విభాగాల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. స్మాల్ రోబోస్, త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీస్, నీటి పునర్వినియోగం వంటి అంశాలపై విద్యార్థులు తయారుచేసిన ప్రజెంటేషన్స్ ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఫెస్ట్​లో సామాజిక అంశాలపై కూడా అవగాహన కల్పించారు.

సీవీఆర్​ కళాశాలలో ఘనంగా 2k22 ఫెస్ట్

ఇదీ చూడండి:

Last Updated : Apr 12, 2022, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.