ETV Bharat / state

జంగపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకుంటాం: వినోద్​కుమార్​ - రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినోద్​కుమార్​ పర్యటన

రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన జంగపల్లి శ్రీనివాస్​ కుటుంబాన్ని ఆదుకుంటామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​ హామీ ఇచ్చారు. పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థికసాయం అందించారు.

boyinpally vinod kumar
జంగపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకుంటాం: వినోద్​కుమార్​
author img

By

Published : Nov 17, 2020, 4:26 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన జంగపల్లి శ్రీనివాస్​ కుటుంబాన్ని రాష్ట్రప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్​పల్లి వినోద్​కుమార్ పరామర్శించారు. పార్టీ తరఫున రూ.5 లక్షలు ఆర్థికసాయం అందించినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా దర్గాపల్లి వాగులో మూడు నెలల క్రితం శ్రీనివాస్​ గల్లంతై మృతిచెందారు.

శ్రీనివాస్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం. వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపడతాం. శ్రీనివాస్ భార్యకు ఉపాధి కల్పిస్తాం. రాష్ట్రంలోని ప్రతీ తెరాస కార్యకర్తను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ కంటికిరెప్పలా కాపాడుకుంటున్నారు.

-వినోద్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు

అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ ఛైర్మన్ కొండూరు రవీంద్రరావు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నేలకొండ అరుణ, ఎంపీపీ పడిగెల మానస, జడ్పీటీసీ సభ్యురాలు మంజుల, ఇతర నేతలు పాల్గొన్నారు.

ఇవీచూడండి: గ్యాస్​ లీకై పూరిల్లు దగ్ధం.. కుటుంబసభ్యలు క్షేమం

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన జంగపల్లి శ్రీనివాస్​ కుటుంబాన్ని రాష్ట్రప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్​పల్లి వినోద్​కుమార్ పరామర్శించారు. పార్టీ తరఫున రూ.5 లక్షలు ఆర్థికసాయం అందించినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా దర్గాపల్లి వాగులో మూడు నెలల క్రితం శ్రీనివాస్​ గల్లంతై మృతిచెందారు.

శ్రీనివాస్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం. వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపడతాం. శ్రీనివాస్ భార్యకు ఉపాధి కల్పిస్తాం. రాష్ట్రంలోని ప్రతీ తెరాస కార్యకర్తను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ కంటికిరెప్పలా కాపాడుకుంటున్నారు.

-వినోద్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు

అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ ఛైర్మన్ కొండూరు రవీంద్రరావు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నేలకొండ అరుణ, ఎంపీపీ పడిగెల మానస, జడ్పీటీసీ సభ్యురాలు మంజుల, ఇతర నేతలు పాల్గొన్నారు.

ఇవీచూడండి: గ్యాస్​ లీకై పూరిల్లు దగ్ధం.. కుటుంబసభ్యలు క్షేమం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.