ETV Bharat / state

కరోనా నియంత్రణకు ప్రణాళికతో ముందుకెళ్లాలి: కేటీఆర్​ - కేటీఆర్ తాజా​ వార్తలు

కరోనా నియంత్రణకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. కొవిడ్ రెండో దశ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో భాగంగా బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్​తో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

కలెక్టర్​తో టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించిన కేటీఆర్​
కలెక్టర్​తో టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించిన కేటీఆర్​
author img

By

Published : May 12, 2021, 8:39 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్​ కృష్ణ భాస్కర్​తో మున్సిపల్​, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, ఆస్పత్రుల్లో అందించాల్సిన మెరుగైన వైద్యం, తదితర అంశాలపై మంత్రి చర్చించి, కలెక్టర్​కు పలు సూచనలు చేశారు.

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవలపై మంత్రి ఆరా తీశారు. ఆయా ఆస్పత్రులలో అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్ నిర్వహణ, పేషెంట్లకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ లభ్యత, రవాణా విషయంలో ఇబ్బందులు లేకుండా అధికారులు ముందుచూపుతో వ్యవహరిస్తూ క్షేత్ర స్థాయిలో సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

రాబోయే రెండు వారాలు అత్యంత కీలకమని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రత్యేక ప్రణాళికతో, ముందు చూపుతో వ్యవహరిస్తూ ప్రజలెవరూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ లాక్​డౌన్ నియమాలను పాటిస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అని, అత్యవసరమైతేనే ప్రభుత్వం సూచించిన నిర్దేశిత సమయంలో ప్రజలు బయటికి రావాలని మంత్రి పిలుపునిచ్చారు.

తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా క్లిష్ట పరిస్థితుల్లో కొవిడ్ పేషెంట్లకు మనోధైర్యాన్ని కల్పిస్తూ, మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. వారి సేవలు అభినందనీయమని ప్రశంసించారు.

వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేతో సత్ఫలితాలు వస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఆరోగ్య కార్యకర్తలు చేస్తున్న ఈ ఇంటింటి జ్వర సర్వే ద్వారా లక్షణాలు ఉన్నవారిని ముందుగానే గుర్తించి వ్యాధి వ్యాప్తిని కట్టడి చేయడం సులభతరం అవుతుందని తెలిపారు. జిల్లాలో రోజువారీగా పరిస్థితిని తాను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తానని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థాయిలో అవసరమైన అన్ని చర్యలు చేపడుతూ కరోనా రెండో దశ వ్యాధి వ్యాప్తి కట్టడి చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్​ కృష్ణ భాస్కర్​తో మున్సిపల్​, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, ఆస్పత్రుల్లో అందించాల్సిన మెరుగైన వైద్యం, తదితర అంశాలపై మంత్రి చర్చించి, కలెక్టర్​కు పలు సూచనలు చేశారు.

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవలపై మంత్రి ఆరా తీశారు. ఆయా ఆస్పత్రులలో అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్ నిర్వహణ, పేషెంట్లకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ లభ్యత, రవాణా విషయంలో ఇబ్బందులు లేకుండా అధికారులు ముందుచూపుతో వ్యవహరిస్తూ క్షేత్ర స్థాయిలో సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

రాబోయే రెండు వారాలు అత్యంత కీలకమని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రత్యేక ప్రణాళికతో, ముందు చూపుతో వ్యవహరిస్తూ ప్రజలెవరూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ లాక్​డౌన్ నియమాలను పాటిస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అని, అత్యవసరమైతేనే ప్రభుత్వం సూచించిన నిర్దేశిత సమయంలో ప్రజలు బయటికి రావాలని మంత్రి పిలుపునిచ్చారు.

తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా క్లిష్ట పరిస్థితుల్లో కొవిడ్ పేషెంట్లకు మనోధైర్యాన్ని కల్పిస్తూ, మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. వారి సేవలు అభినందనీయమని ప్రశంసించారు.

వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేతో సత్ఫలితాలు వస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఆరోగ్య కార్యకర్తలు చేస్తున్న ఈ ఇంటింటి జ్వర సర్వే ద్వారా లక్షణాలు ఉన్నవారిని ముందుగానే గుర్తించి వ్యాధి వ్యాప్తిని కట్టడి చేయడం సులభతరం అవుతుందని తెలిపారు. జిల్లాలో రోజువారీగా పరిస్థితిని తాను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తానని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థాయిలో అవసరమైన అన్ని చర్యలు చేపడుతూ కరోనా రెండో దశ వ్యాధి వ్యాప్తి కట్టడి చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఆ 4 గంటలు ఎంతో కీలకం.. ఉరుకులు పరుగులతో రోజువారీ పనులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.