ETV Bharat / state

Minister KTR: 'అర్హులందరికీ రేషన్​ కార్డులు.. పేదల సంక్షేమమే లక్ష్యం'

author img

By

Published : Jul 26, 2021, 4:15 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్​ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహార భద్రతా కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సిరిసిల్లలో లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్​ రేషన్​ కార్డులు పంపిణీ చేశారు.

ration cards distribution in sirscilla
సిరిసిల్లలో రేషన్​ కార్డుల పంపిణీ

రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ నూతన రేషన్ కార్డులు అందజేస్తున్నట్లు.. పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు మూడు లక్షల మందికి రేషన్ కార్డులు అందజేయడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. సిరిసిల్లలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో లబ్ధిదారులకు కేటీఆర్​ ఆహార భద్రతా కార్డులు అందజేశారు.

మొదటగా పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో రూ.2.20 కోట్లతో ఏర్పాటు చేసిన సీటీ స్కానింగ్​ కేంద్రాన్ని కేటీఆర్​ ప్రారంభించారు. జిల్లా ప్రజలకు మెరుగైన, పారదర్శక వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్కానింగ్​ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం జిల్లాలో కరోనాతో మృతి చెందిన తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్​ కుటుంబాన్ని పరామర్శించారు. వారికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం పట్టణంలోని సయ్యద్ సాబీర్, కౌన్సిలర్ దిడ్డి రాజు, మాధవిల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, టెస్కాబ్ ఛైర్మన్ కొండూరు రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ నూతన రేషన్ కార్డులు అందజేస్తున్నట్లు.. పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు మూడు లక్షల మందికి రేషన్ కార్డులు అందజేయడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. సిరిసిల్లలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో లబ్ధిదారులకు కేటీఆర్​ ఆహార భద్రతా కార్డులు అందజేశారు.

మొదటగా పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో రూ.2.20 కోట్లతో ఏర్పాటు చేసిన సీటీ స్కానింగ్​ కేంద్రాన్ని కేటీఆర్​ ప్రారంభించారు. జిల్లా ప్రజలకు మెరుగైన, పారదర్శక వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్కానింగ్​ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం జిల్లాలో కరోనాతో మృతి చెందిన తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్​ కుటుంబాన్ని పరామర్శించారు. వారికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం పట్టణంలోని సయ్యద్ సాబీర్, కౌన్సిలర్ దిడ్డి రాజు, మాధవిల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, టెస్కాబ్ ఛైర్మన్ కొండూరు రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: NEW RATION CARDS: రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.