రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామం వద్ద భూమిలో టిఫిన్ బాక్స్ లభించటం కలకలం సృష్టించింది. మరిమడ్ల- మానాల రహదారి మధ్య భూమిలో టిఫిన్ బాక్స్ ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. బాంబు డిస్పోజల్ బృందాన్ని రప్పించారు. జేసీబీ సహాయంతో... తవ్వకాలు జరిపి టిఫిన్ బాక్సును వెలికి తీశారు.
అనంతరం టిఫిన్ బాక్సులో పరిశీలించగా నల్లకోడి, నిమ్మకాయలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. ఇటీవల సరిహద్దు రాష్ట్రాల్లో మావోయిస్టుల సంచారం ఉండటంతో... అప్రమత్తమయ్యామని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: 'ధాన్యం కొన్న పదిరోజుల్లో డబ్బు ఖాతాలో జమ చేస్తాం'