తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 131(ఎల్ఆర్ఎస్)ను వెంటనే రద్దు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ నేతలు రాస్తారోకో చేపట్టి తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ప్రభుత్వం కరవు కాలంలో పేదలపై ఆర్థిక భారం వేయడం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ ధ్వజమెత్తారు. న్యాయస్థానంలో సర్కారుకు వ్యతిరేకంగా మొట్టికాయలు తగిలినా.. వారి పద్ధతి మారకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎల్ఆర్ఎస్ జీవోను బేషరతుగా రద్దు చేస్తామని భరోసా ఇచ్చారు.
![Congress protest to abolish LRS in vemulawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-krn-91-10-congress-dharna-av-ts10041_08102020131216_0810f_00885_525.jpeg)
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎన్నుకోవడం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యులు ఆది శ్రీనివాస్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోంది: ఉత్తమ్