భారత్-చైనా సరిహద్దులో అసువుల బారిన అమరవీరులకు శాంతి చేకూరాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మౌనదీక్ష చేపట్టారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పించి మౌనం పాటించారు.
గంటపాటు మౌనదీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిర్లక్ష్య ధోరణితోనే సైనికులు అమరులు అవుతున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: ప్రతిఇంటికీ ఆరు మొక్కలు... వాటికి కుటుంబ సభ్యుల పేర్లు: కేసీఆర్