పోలీసుల పనితీరు మెరుగ్గా ఉందని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. పెద్దపెల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ కార్యాలయం పరిధిలో నిర్మిస్తున్న పోలీస్ భవనాల పనులను సీపీ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు.
నిర్మాణంలో జాప్యానికి కారణాలపై గుత్తేదారులతో మాట్లాడారు. పనుల్లో వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రామగుండం కమిషనరేట్తోపాటు రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం చేపట్టిన పోలీస్ శాఖ భవనాలను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మాత్రమే పోలీస్ స్టేషన్లల నిర్వహణకు నెలకు రూ. 25 వేల నుంచి 75 వేలు విడుదల చేస్తోందని తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ను ఇతర రాష్ట్రాల సీఎంలు కొనియాడినట్లు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో రూ. 400 కోట్లతో అత్యాధునిక హంగులతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు కొనసాగుతున్నాయన్నారు.