ETV Bharat / state

'పదేళ్ల బిల్లులు ఇప్పుడు కట్టమంటే ఎట్ల కట్టాలే...?' - MUTTARAM VILLAGERS PROTESTED FOR CURRENT

పదేళ్లుగా ఏనాడు అడగకుండా... అన్నీ బిల్లులు ఇప్పుడు కట్టమంటే ఎలా కడతామంటూ... పెద్దపల్లి జిల్లా ముత్తారం ఎస్సీ, ఎస్టీ కాలనీ ప్రజలు ఆందోళనకు దిగారు. బేషరతుగా... బకాయిలన్నీ మాఫీ చేసి ఒక్కరోజులో విద్యుత్​ సరఫరా పునరుద్ధరించాలంటూ సబ్​స్టేషన్​ను ముట్టడించారు.

MUTTARAM VILLAGERS PROTESTED FOR CURRENT
MUTTARAM VILLAGERS PROTESTED FOR CURRENT
author img

By

Published : Dec 16, 2019, 11:50 PM IST

పెద్దపల్లి జిల్లా ముత్తారంలో సీపీఎం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలు ఆందోళన నిర్వహించారు. 13 రోజులుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయటాన్ని నిరసిస్తూ... ర్యాలీ తీశారు. డిప్యూటీ తహసీల్దార్​కు వినతి పత్రం అందించారు. పదేళ్లుగా ఏరోజు కరెంటు బిల్లులు కట్టాలని అడగని అధికారులు... ఇప్పుడు ఏకంగా 50 నుంచి 70 వేల బిల్లు కట్టాలనటం అన్యాయమని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బకాయిలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సబ్​స్టేషన్ ముట్టడించారు. ఒక్క రోజులో విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు విద్యుత్ అధికారులు మాత్రం అనేకసార్లు హెచ్చరించినా... ఎవ్వరూ స్పందించి బిల్లులు కట్టలేదని చెబుతున్నారు. 2013 నుంచి నేటి వరకు బకాయిలు చెల్లించకపోవడం వల్లే... ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరా నిలిపేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

'పదేళ్ల బిల్లులు ఇప్పుడు కట్టమంటే ఎట్ల కట్టాలే...?'

ఇదీ చూడండి : పాత్రికేయులు, రాజకీయ నాయకుల బంధం విచిత్రమైనది: కవిత

పెద్దపల్లి జిల్లా ముత్తారంలో సీపీఎం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలు ఆందోళన నిర్వహించారు. 13 రోజులుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయటాన్ని నిరసిస్తూ... ర్యాలీ తీశారు. డిప్యూటీ తహసీల్దార్​కు వినతి పత్రం అందించారు. పదేళ్లుగా ఏరోజు కరెంటు బిల్లులు కట్టాలని అడగని అధికారులు... ఇప్పుడు ఏకంగా 50 నుంచి 70 వేల బిల్లు కట్టాలనటం అన్యాయమని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బకాయిలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సబ్​స్టేషన్ ముట్టడించారు. ఒక్క రోజులో విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు విద్యుత్ అధికారులు మాత్రం అనేకసార్లు హెచ్చరించినా... ఎవ్వరూ స్పందించి బిల్లులు కట్టలేదని చెబుతున్నారు. 2013 నుంచి నేటి వరకు బకాయిలు చెల్లించకపోవడం వల్లే... ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరా నిలిపేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

'పదేళ్ల బిల్లులు ఇప్పుడు కట్టమంటే ఎట్ల కట్టాలే...?'

ఇదీ చూడండి : పాత్రికేయులు, రాజకీయ నాయకుల బంధం విచిత్రమైనది: కవిత

Intro:దళితుల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ధర్నా.

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రము లోని దళితుల కాలనీ లో 150 ఇండ్లకు గత పదమూడు రోజులుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ఈరోజు సిపియం పార్టీ ఆధ్వర్యంలో దళితులు ధర్నా నిర్వహించి, ముత్తారం డిప్యూటీ తహసిల్దార్ కు వినతి పత్రం అందించి ర్యాలీగా బయలుదేరి సబ్ స్టేషన్ ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఏరోజు కరెంటు బిల్లులు కట్టాలని అడుగని విద్యుత్ శాఖ వారు రెండు నెలల క్రితం నుండి మీయొక్క విద్యుత్ బిల్లులు చెల్లించని ఒక్కో ఇంటికి దాదాపు 50 వేల నుండి 70 వేల వరకు బకాయిలను కట్టాలని విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో వారు నిరసన వ్యక్తం చేశారు. నివాస గృహాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం అమానుషమని పది సంవత్సరాలుగా ఏనాడు విద్యుత్ బిల్లులు చెల్లించాలని చెప్పకుండా ,బిల్లులు ఇవ్వకుండా నివాస గృహాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఏమిటని ప్రశ్నించారు. తమ బకాయిలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ స్టేషన్ ముట్టడించి ఒక్క రోజులో విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ అధికారులు మాట్లాడుతూ 2013 సంవత్సరం నుంచి నేటి వరకు వీరు బకాయిలు చెల్లించకపోవడం వల్ల, అనేకసార్లు హెచ్చరించిన వినకపోవడం వల్ల,వేలాదిగా రూపాయలు విద్యాశాఖకు బకాయి ఉండడంవల్ల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరా నిలిపి వేసినట్లు తెలిపారు.
బైట్.
1) యాకయ్య - సిపియం నాయకులు
2) సంపత్ - గ్రామస్తుడు.
3). రాజేశ్వరరావు ఏడి మంథనిBody:యం.శివప్రసాద్, మంథని.Conclusion:9440728281.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.