ETV Bharat / state

నిర్మానుష్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం

author img

By

Published : May 12, 2021, 4:27 PM IST

లాక్​డౌన్​తో పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

లాక్​డౌన్​, lock down
నిర్మానుష్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం

పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. లాక్​డౌన్​తో ఎవరూ బయటకు రాలేదు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కరోనా బారిన పడి వంద మందికి పైగా మృత్యువాత పడ్డారు. వేలాది మంది కరోనా పాజిటివ్​తో చికిత్స పొందుతున్నారు.

రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు ఓఎస్డీ చంద్ర పవార్ నేతృత్వంలో గోదావరిఖని, ఎన్టీపీసీ, రామగుండం, బసంత్​నగర్, అంతర్గం, పాలకుర్తి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రిజర్వు పోలీసులు మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు బయటకు రావద్దని పోలీసులు సూచిస్తున్నారు. కరోనా నియంత్రణలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.

పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. లాక్​డౌన్​తో ఎవరూ బయటకు రాలేదు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కరోనా బారిన పడి వంద మందికి పైగా మృత్యువాత పడ్డారు. వేలాది మంది కరోనా పాజిటివ్​తో చికిత్స పొందుతున్నారు.

రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు ఓఎస్డీ చంద్ర పవార్ నేతృత్వంలో గోదావరిఖని, ఎన్టీపీసీ, రామగుండం, బసంత్​నగర్, అంతర్గం, పాలకుర్తి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రిజర్వు పోలీసులు మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు బయటకు రావద్దని పోలీసులు సూచిస్తున్నారు. కరోనా నియంత్రణలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: గ్రేటర్​లో లాక్‌డౌన్‌ అమలు.. నిర్మానుష్యంగా రోడ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.