పెద్దపెల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాశయానికి కాళేశ్వరం నీరు ఎత్తిపోస్తున్నారు. అంతర్గాం మండలం గోయల్వాడలోని పార్వతి పంప్హౌస్ నుంచి 2 టీఎంసీల నీటి ఎత్తిపోతలను విజయవంతంగా చేపట్టారు. ఒకేసారి మొత్తం 9 పంపు మోటర్లతో 23,490 క్యూసెక్కుల నీటిని ఎత్తి పోస్తున్నారు. ఎల్లంపల్లి జలాశయం పూర్తి సామర్థ్యం నీటి నిల్వ 20 టీఎంసీలు, నీటి మట్టం 148 మీటర్లు కాగా.. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎల్లంపల్లి జలాశయంలో నీటి నిల్వ 10.52 టీఎంసీలు నీటి మొత్తం 143.91 మీటర్లకు చేరింది.
మొత్తం ఇన్ఫ్లో 24, 408 క్యూసెక్కులు కాగా... మొత్తం అవుట్ ఫ్లో 16,371 క్యూసెక్కులుగా ఉంది. గోదావరి ఎగువ నుంచి 918 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుంది. నంది పంప్హౌస్ ద్వారా శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి 15,750 క్యూసెక్కులు, ఎన్టీపీసీ తాగునీటి పథకాలకు 621 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు.