ETV Bharat / state

ఈతకు వెళ్లి యువకుడు మృతి

సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన నిజామాబాద్​ జిల్లా ధర్పల్లి మండలంలో చోటు చేసుకుంది. సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన యువకుడు చనిపోవడం వల్ల యువకుడి గ్రామంలో విషాధ ఛాయలు నెలకొన్నాయి.

author img

By

Published : Jun 2, 2020, 10:39 PM IST

Young Man Died In Ramadugu Project
ఈతకు వెళ్లి యువకుడు మృతి

నిజామాబాద్​ జిల్లా ధర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టు ఎడమ కాలువ పరిధిలోని సుద్దులం గ్రామ శివారులో యువకుడు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన రామసత్యం నీటిలో మునిగి చనిపోయాడు. నిజామాబాద్​ నగరంలోని బోర్గాం (పీ) గ్రామానికి చెందిన రామసత్యం మరణవార్తతో యువకుడి స్వగ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నిజామాబాద్​ జిల్లా ధర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టు ఎడమ కాలువ పరిధిలోని సుద్దులం గ్రామ శివారులో యువకుడు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన రామసత్యం నీటిలో మునిగి చనిపోయాడు. నిజామాబాద్​ నగరంలోని బోర్గాం (పీ) గ్రామానికి చెందిన రామసత్యం మరణవార్తతో యువకుడి స్వగ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'తెలంగాణకు కేసీఆర్ దేవుడిచ్చిన వరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.