భారత జాతీయ జట్టుకు ఎంపికై అంతర్జాతీయ మ్యాచ్లలో ప్రాతినిథ్యం వహించి తిరిగి దేశానికి చేరుకున్న సీనియర్ ఉమెన్ టీమ్ ఫుట్బాల్ ప్లేయర్ గుగులోత్ సౌమ్యకు నిజామాబాద్లో ఘన స్వాగతం లభించింది. దేశం తరఫున టర్కీ, ఉజ్బెకిస్థాన్తో జరిగిన పోటీల్లో సత్తా చాటి నాలుగు మ్యాచ్లలో దేశానికి ప్రాతినిథ్యం వహించింది. నగరంలోని పులాంగ్ చౌరస్తాలో సౌమ్యకు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్, ప్రజలు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సన్మానించారు. సౌమ్యతో పాటు కోచ్ నాగరాజును జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్, కేర్ ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
అందరి సహకారంతోనే సీనియర్ జట్టుకు ఎంపికయ్యానని.. కోచ్, తల్లిదండ్రులు ఎంతో సహకరించారని సౌమ్య చెప్పారు. సౌమ్య ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన కోచ్.. దేశం తరఫున మరిన్ని టోర్నీల్లో సత్తా చాటాలని కోచ్ నాగరాజు అన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సౌమ్య.. భారత ఫుట్బాల్ మహిళల జట్టుకు తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక అమ్మాయి అని కొనియాడారు.
ఇవీచూడండి: షర్మిల రాజకీయ భవిష్యత్తు తెలంగాణతోనే ముడిపడి ఉంది: విజయమ్మ