నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గగ్గుపల్లి గ్రామ రైతులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో.. గత 40 రోజుల నుంచి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షం వల్ల బస్తాలు తడిసి పోతున్నాయని అన్నదాతలు పేర్కొంటున్నారు.
రాజకీయ పలుకుబడి ఉన్న రైతుల ధాన్యం కాంట వేసి రైస్ మిల్లులకు పంపుతున్నారని.. సన్నకారు రైతుల ధాన్యాన్ని పక్కన పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ అధికారి హరికృష్ణ, తహసీల్దార్ సంజీవ్ రావులు అక్కడికి చేరుకుని రైతులతో చర్చించారు. రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడం వల్ల ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి: ఒకే కుటుంబంలో 8 మందికి కరోనా పాజిటివ్