నిజామాబాద్ నగరంలోని వాసని నగర్ అపార్ట్మెంట్లో సీజనల్ వ్యాధుల నివారణ, నియంత్రణపై నగర మేయర్ దండు నీతూ కిరణ్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నగరంలో ఇకపై ప్రతి ఆదివారం సీజనల్ వ్యాధుల మీద ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పరిసర ప్రాంతాల్లో నిల్వనీటిని తొలగించడం, పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలు నిత్యం ఉండేలా ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. రోజుకో కాలనీలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
నిజామాబాద్లోని 44వ డివిజన్లో వాసవి అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కాలనీ వాసులతో మేయర్ మాట్లాడారు. అపార్ట్మెంట్ వాసులంతా.. తడిచెత్త, పొడిచెత్త వేరు చేసి వేయాలని, ఎక్కడ పడితే అక్కడ చెత్త, నిల్వ నీరు ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జితేశ్ వి.పాటిల్, ఎంహెచ్వో శ్రీనివాస్, అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: గ్రేటర్లో కొత్త ప్రాంతాల్లో పెరుగుతున్న కొవిడ్ కేసులు