ETV Bharat / state

అది మలుపు కాదు... మృత్యు పిలుపు - road accidents in sampally turning point at nizamabad district

హైవేలు విశాలంగా ఉన్నాయని... రయ్​ రయ్​మని వెళ్తే.. ఇక అంతే సంగతులు. ఒక్క మలుపు చాలు... మీ జీవితం మారిపోవడానికి.... మీరేంత వేగంతో వేళ్తే... అంతే వేగంగా అనంతలోకాలకు చేరుకుంటారు. రోడ్డు ప్రమాదాలు... ఎన్నో కుటుంబాల్ని రోడ్డున పడేస్తున్నాయి.  నిజామాబాద్​ జిల్లా సాంపల్లి వద్ద 44వ నంబర్​ జాతీయ రహదారి వద్ద మలుపు  మృత్యు పిలుపుగా మారింది.

road accidents in sampally turning point at nizamabad district
అది మలుపు కాదు... మృత్యు పిలుపు
author img

By

Published : Dec 29, 2019, 7:21 AM IST

అది మలుపు కాదు... మృత్యు పిలుపు

నిజామాబాద్​ జిల్లాలో జాతీయ రహదారులు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ముఖ్యంగా మలుపులు మృత్యు పిలుపులుగా మారాయి. జాతీయ రహదారి నుంచి గ్రామాలకు వెళ్లే చోట తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో కొంత మంది ప్రాణాలు కోల్పోతుండగా... మరికొందరు క్షతగాత్రులుగా మిగులుతున్నారు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి.

ఎన్నో ప్రమాదాలు:

ఈనెల 19న తెల్లవారుజామున కంటైనర్​ను డీసీఎం వ్యాన్​ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రమాదస్థలిలోనే మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా సాంపల్లి వద్ద 44వ నంబర్​ జాతీయ రహదారిపై జరిగింది.
కామారెడ్డి నుంచి ఆర్మూర్​ వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం... కాళేశ్వరం ప్యాకేజ్​లో భాగంగా... భారీ పైపులను తీసుకెళ్తున్న కంటైనర్​ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్​, క్లీనర్​ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

వారం రోజుల వ్యవధిలో ఇదే మూలమలుపు వద్ద తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో భారీ పైపుల లోడ్​తో యూటర్న్ తీసుకుంటున్న కంటైనర్​ను వెనుక నుంచి వస్తున్న లారీ, ఢీ కొట్టింది. కంటైనర్ పైన ఉన్న పైపులు రోడ్డుపై పడడంతో ముందు నుంచి వస్తున్న అశోక్ లేలాండ్ ట్రాలీ ఆటో పైపులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్​తో పాటు ట్రాలీ ఆటోలో ఉన్న హర్షవర్ధన్, గౌతమ్​లకు తీవ్రగాయాలయ్యాయి. భారీ వాహనాలతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తరచూ ప్రమాదాలు

నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి మండలంలోని సాంపల్లి-సుద్దపల్లి మధ్యలో గత కొన్ని నెలలుగా కాళేశ్వరం పనులకు ఉపయోగించే భారీ పైపులకు రేలింగ్​ పనులు నడుస్తున్నాయి. భారీ పైపులతో పెద్ద కంటైనర్లు నిత్యం పదుల సంఖ్యలో వస్తూ ఉంటాయి. అయితే సుద్దపల్లి వద్ద వంతెన చిన్నగా ఉండటంతో కంటైనర్​లను సాంపల్లి వద్ద యూటర్న్​ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో భారీ కంటైనర్​లు రోడ్డుకు అడ్డంగా రావడంతో రాత్రి వేళల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

మలుపు వద్ద లైట్లను పెట్టండి

లైట్లు లేకపోవడం, యూటర్న్ తీసుకుంటున్న వాహనం కనిపించక వాహనాలు ఢీకొట్టి ప్రమాదాలు సంభవిస్తున్నాయని గ్రామస్థులు అంటున్నారు. మలుపు వద్ద లైట్లు ఏర్పాటు చేయాలని, డివైడర్ మూసివేసి సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ప్రాణాల్ని కాపాడండి

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సాంపల్లి గ్రామస్థులు కోరుతున్నారు. లేదంటే మరింత మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలను నివారించి... ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చూడండి: గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. తిరంగ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

అది మలుపు కాదు... మృత్యు పిలుపు

నిజామాబాద్​ జిల్లాలో జాతీయ రహదారులు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ముఖ్యంగా మలుపులు మృత్యు పిలుపులుగా మారాయి. జాతీయ రహదారి నుంచి గ్రామాలకు వెళ్లే చోట తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో కొంత మంది ప్రాణాలు కోల్పోతుండగా... మరికొందరు క్షతగాత్రులుగా మిగులుతున్నారు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి.

ఎన్నో ప్రమాదాలు:

ఈనెల 19న తెల్లవారుజామున కంటైనర్​ను డీసీఎం వ్యాన్​ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రమాదస్థలిలోనే మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా సాంపల్లి వద్ద 44వ నంబర్​ జాతీయ రహదారిపై జరిగింది.
కామారెడ్డి నుంచి ఆర్మూర్​ వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం... కాళేశ్వరం ప్యాకేజ్​లో భాగంగా... భారీ పైపులను తీసుకెళ్తున్న కంటైనర్​ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్​, క్లీనర్​ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

వారం రోజుల వ్యవధిలో ఇదే మూలమలుపు వద్ద తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో భారీ పైపుల లోడ్​తో యూటర్న్ తీసుకుంటున్న కంటైనర్​ను వెనుక నుంచి వస్తున్న లారీ, ఢీ కొట్టింది. కంటైనర్ పైన ఉన్న పైపులు రోడ్డుపై పడడంతో ముందు నుంచి వస్తున్న అశోక్ లేలాండ్ ట్రాలీ ఆటో పైపులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్​తో పాటు ట్రాలీ ఆటోలో ఉన్న హర్షవర్ధన్, గౌతమ్​లకు తీవ్రగాయాలయ్యాయి. భారీ వాహనాలతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తరచూ ప్రమాదాలు

నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి మండలంలోని సాంపల్లి-సుద్దపల్లి మధ్యలో గత కొన్ని నెలలుగా కాళేశ్వరం పనులకు ఉపయోగించే భారీ పైపులకు రేలింగ్​ పనులు నడుస్తున్నాయి. భారీ పైపులతో పెద్ద కంటైనర్లు నిత్యం పదుల సంఖ్యలో వస్తూ ఉంటాయి. అయితే సుద్దపల్లి వద్ద వంతెన చిన్నగా ఉండటంతో కంటైనర్​లను సాంపల్లి వద్ద యూటర్న్​ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో భారీ కంటైనర్​లు రోడ్డుకు అడ్డంగా రావడంతో రాత్రి వేళల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

మలుపు వద్ద లైట్లను పెట్టండి

లైట్లు లేకపోవడం, యూటర్న్ తీసుకుంటున్న వాహనం కనిపించక వాహనాలు ఢీకొట్టి ప్రమాదాలు సంభవిస్తున్నాయని గ్రామస్థులు అంటున్నారు. మలుపు వద్ద లైట్లు ఏర్పాటు చేయాలని, డివైడర్ మూసివేసి సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ప్రాణాల్ని కాపాడండి

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సాంపల్లి గ్రామస్థులు కోరుతున్నారు. లేదంటే మరింత మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలను నివారించి... ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చూడండి: గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. తిరంగ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

tg_nzb_02_26_sampally_malupu_pramadhalaku_pilupu_pkg_ts10108 Etv Contributor: Srikanth(NZB Rural) ( ) జిల్లాలో జాతీయ రహదారులు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ముఖ్యంగా మలుపులు మృత్యు పిలుపులుగా మారాయి. జాతీయ రహదారి నుంచి గ్రామాలకు వెళ్లే చోట తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవేలు విశాలంగా ఉండడంతో రహదారిపై వాహనాలు రయ్‌ మంటూ దూసుకెళ్తున్నాయి. మలుపుల వద్ద వాహనాలను అకస్మాత్తుగా అదుపు చేయలేక నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో కొంత మంది ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు క్షతగాత్రులుగా మిగులుతున్నారు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ..LOOOK VO: ఈనెల19 న గురువారం తెల్లవారుజామున కంటైనర్​ను.. డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడం వల్ల ... ఇద్దరు ప్రమాద స్థలిలోనే మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలం సాంపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. కామారెడ్డి నుంచి ఆర్మూర్ వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం... కాళేశ్వరం ప్యాకేజ్​లో భాగంగా భారీ పైపులను తీసుకువెళ్తున్న కంటైనర్​ను వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆర్మూర్ కు చెందిన డీసీఎం డ్రైవర్ షేక్ కరీం, క్లీనర్ ముజాహిద్ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి రమేష్​ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మరవకముందే వారం రోజుల వ్యవధిలో ఇదే మూలమలుపు వద్ద ఈరోజు తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో భారీ పైపుల లోడుతో యూ టర్న్ తీసుకుంటున్న కంటైనర్ ను వెనుక నుండి వస్తున్న లారీ, ఢీ కొనగా కంటైనర్ పైన ఉన్న పైపులు రోడ్డుపై పడడంతో ముందు నుంచి వస్తున్న అశోక్ లేలాండ్ ట్రాలీ ఆటో పైపులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ తో ట్రాలీ ఆటో లో ఉన్న అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి కి చెందిన హర్షవర్ధన్, గౌతం లకు తీవ్రగాయాలు అయ్యాయి. భారీ వాహనాలతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు...BYTES Byte: మురళి, సాంపల్లి గ్రామస్తుడు. Byte. అనిల్ కుమార్, వాహనదారుడు. VO: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని సాంపల్లి- సుద్దపల్లి మధ్యలో గత కొన్ని నెలలుగా కాళేశ్వరం పథకంలో ఉపయోగించే భారీ పైపులకు రేలింగ్ పనులు నడుస్తున్నాయి. భారీ పైపులతో పెద్ద కంటెయినర్లు నిత్యం పదుల సంఖ్యలో వస్తూ ఉంటాయి. అయితే సుద్దపల్లి వద్ద వంతెన చిన్నగా ఉండటంతో కంటైనర్ లను సాంపల్లి వద్ద యూటర్న్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో భారీ కంటైనర్ లు రోడ్డుకు అడ్డంగా రావడంతో రాత్రి వేళల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తెల్లవారుఝామున, రాత్రి వేళల్లో అధిక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగగా.. ప్రాణాలు కోల్పోతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లైట్లు లేకపోవడం, యూటర్న్ తీసుకుంటున్న వాహనం కనిపించక వాహనాలు గుద్దుకొని ప్రమాదాలు సంభవిస్తున్నాయని గ్రామస్థులు అంటున్నారు. మలుపు వద్ద లైట్లు ఏర్పాటు చేయాలని, డివైడర్ మూసివేసి సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు....BYTES Byte. రవి, స్థానికుడు. Byte. జంగన్న, సాంపల్లి గ్రామస్తులు EVO: ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సాంపల్లి గ్రామస్థులు కోరుతున్నారు. లేదంటే మరింత మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలను నివారించి.. ప్రాణాలు కాపాడలని విజ్ఞప్తి చేస్తున్నారు.....END
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.