ETV Bharat / state

కఠిన నిర్ణయాలు అమలు చేస్తాం: మున్సిపల్ కమిషనర్

author img

By

Published : Apr 11, 2020, 3:29 PM IST

వచ్చే సోమవారం నుంచి కఠిన నిర్ణయాలు అమలు చేయనున్నట్లు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని సూచించారు.

'కఠిన నిర్ణయాలు అమలు చేస్తాం'
'కఠిన నిర్ణయాలు అమలు చేస్తాం'

కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతాలను రెడ్ ​జోన్​గా ప్రకటించామని, ఆ ప్రాంతాల నుంచి ఎవరూ బయటకు రాకూడదని కోరారు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జితేశ్​ వీ పాటిల్. వచ్చే సోమవారం నుంచి కఠిన నిర్ణయాలు అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దుకాణ సముదాయాలు తెరిచి ఉంచాలని ఆదేశించారు. ఒంటి గంట తర్వాత రోడ్లపై రాకూడదని, అత్యవసరమైతేనే బయటికి రావాలని విజ్ఞప్తి చేశారు. మాస్కు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని పేర్కొన్నారు.

కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతాలను రెడ్ ​జోన్​గా ప్రకటించామని, ఆ ప్రాంతాల నుంచి ఎవరూ బయటకు రాకూడదని కోరారు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జితేశ్​ వీ పాటిల్. వచ్చే సోమవారం నుంచి కఠిన నిర్ణయాలు అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దుకాణ సముదాయాలు తెరిచి ఉంచాలని ఆదేశించారు. ఒంటి గంట తర్వాత రోడ్లపై రాకూడదని, అత్యవసరమైతేనే బయటికి రావాలని విజ్ఞప్తి చేశారు. మాస్కు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని పేర్కొన్నారు.

ఇవీచూడండి: ప్రపంచవ్యాప్తంగా 'లక్ష' దాటిన కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.