ETV Bharat / state

ఎమ్మెల్యే పుట్టినరోజు కానుక.. ఆలయానికి కోటి విరాళం

author img

By

Published : Feb 24, 2021, 7:56 PM IST

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆలయ అభివృద్ధికి ముందుకొచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్​ జిల్లా నవీపేట్​ మండలం జన్నేపల్లి గ్రామంలో పురాతన శివాలయానికి కోటి రూపాయలు ప్రకటించారు.

MLA mynampally hanmantha rao  given on crore rupees for temple development in for his birthday occasion in nizamabad district
ఎమ్మెల్యే పుట్టినరోజు కానుక.. ఆలయానికి కోటి విరాళం

ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో ఆలయ అభివృద్ధికి చేయూతనందించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన జన్మదినం సందర్భంగా పురాతన శివాలయానికి కోటి రూపాయలు ప్రకటించారు. నిజామాబాద్​ జిల్లా నవీపేట్​ మండలం జన్నేపల్లి గ్రామంలోని ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నారు.

temple
జన్నేపల్లి గ్రామంలోని పురాతన శివాలయం

స్వామివారికి అభిషేకం నిర్వహించాక అన్ని శుభాలే కలిగాయని.. అందుకే ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్చి ఒకటో తేదీన ఎమ్మెల్సీ కవిత ఆలయాన్ని ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఆలయ ప్రచారం కోసం హైదరాబాద్ నుంచి 200 కార్లు, ద్విచక్ర వాహనాలతో పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుందని హన్మంతరావు వెల్లడించారు.

ఇదీ చూడండి : లక్ష్మీనరసింహ స్వామి ఎత్తిపోతల పనుల ప్రీక్లోజర్​కు అనుమతి

ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో ఆలయ అభివృద్ధికి చేయూతనందించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన జన్మదినం సందర్భంగా పురాతన శివాలయానికి కోటి రూపాయలు ప్రకటించారు. నిజామాబాద్​ జిల్లా నవీపేట్​ మండలం జన్నేపల్లి గ్రామంలోని ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నారు.

temple
జన్నేపల్లి గ్రామంలోని పురాతన శివాలయం

స్వామివారికి అభిషేకం నిర్వహించాక అన్ని శుభాలే కలిగాయని.. అందుకే ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్చి ఒకటో తేదీన ఎమ్మెల్సీ కవిత ఆలయాన్ని ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఆలయ ప్రచారం కోసం హైదరాబాద్ నుంచి 200 కార్లు, ద్విచక్ర వాహనాలతో పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుందని హన్మంతరావు వెల్లడించారు.

ఇదీ చూడండి : లక్ష్మీనరసింహ స్వామి ఎత్తిపోతల పనుల ప్రీక్లోజర్​కు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.