నిజామాబాద్ నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిత్యం పరిశీలించేందుకు ఎలక్ట్రిక్ వాహనం ఉపయోగపడుతుందని... ఎమ్మెల్యే గణేశ్ గుప్తా తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా కొనుగోలు చేసిన వాహనాన్ని ఆయన ప్రారంభించారు.
వాహనాన్ని స్వయంగా నడుపుతూ నగరంలోని పలు కాలనీల్లో పర్యటించి... పనులను పరిశీలించారు. ఎలక్ట్రిక్ వాహనంలో దాదాపు 11 మంది కూర్చునే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. నిత్యం ఏదో ఒక కాలనీలో అధికారులతో కలిసి పర్యటించనున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
![MLA Ganesh Gupta launched an electric vehicle in Nizamabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10757526_jih.png)
ఇదీ చదవండి: హైదరాబాద్లో కిలాడీ లేడీ.. పెళ్లి పేరుతో రూ.11కోట్లు లూటీ