ETV Bharat / state

'ఎక్కడా నీరు నిలవొద్దు.. దోమ కనిపించొద్దు'

నిజామాబాద్​ని దోమల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నగర మేయర్​ నీతూ కిరణ్​ కోరారు. పట్టణంలోని పలు డివిజన్లలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆమె పర్యవేక్షించారు.

mayor nitu kiran visited cleaning programs in nizamabad
'ఎక్కడా నీరు నిలవకూడదు.. దోమ కానరాకూడదు'
author img

By

Published : Jun 6, 2020, 7:40 PM IST

నిజామాబాద్ నగరంలోని పలు డివిజన్లలో జరుగుతున్న పారిశుద్ధ్య, డ్రైనేజ్‌ పూడికతీత పనుల‌ను మేయర్‌ నీతూ కిరణ్‌ పర్యవేక్షించారు. వ‌ర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో ఎక్కడా నీరు నిలువ‌కుండా ఉండేందుకు తీసుకోవల‌సిన చర్యల‌ గురించి అధికారుల‌కు సూచనలు చేశారు.

ప్రజలు కూడా తడి, పొడి చెత్తను వేరుచేసి మున్సిపల్‌ సిబ్బందికి అందించాలని తెలిపారు. నిజామాబాద్ నగరాన్ని దోమల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు.

నిజామాబాద్ నగరంలోని పలు డివిజన్లలో జరుగుతున్న పారిశుద్ధ్య, డ్రైనేజ్‌ పూడికతీత పనుల‌ను మేయర్‌ నీతూ కిరణ్‌ పర్యవేక్షించారు. వ‌ర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో ఎక్కడా నీరు నిలువ‌కుండా ఉండేందుకు తీసుకోవల‌సిన చర్యల‌ గురించి అధికారుల‌కు సూచనలు చేశారు.

ప్రజలు కూడా తడి, పొడి చెత్తను వేరుచేసి మున్సిపల్‌ సిబ్బందికి అందించాలని తెలిపారు. నిజామాబాద్ నగరాన్ని దోమల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు.

ఇవీచూడండి: కరోనాతోనే మధుసూదన్ మృతి.. ఆధారాలున్నాయ్..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.