నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని నడిపల్లి గ్రామ శివారులోని భారత్ పెట్రోల్ బంకులో అర్ధరాత్రి చోరీ జరిగింది. ముసుగులు, కర్రలు, నిక్కర్లు ధరించిన ఐదుగురు దుండగులు పంపు స్టేషన్ వెనుక నుంచి ప్రవేశించారు.
ఇద్దరు బంకు సిబ్బందిపై దాడి చేసి సుమారు రూ. 80 వేల రూపాయలతో పరారయ్యారు. సంఘటన జరిగిన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అనంతరం క్యాషియర్ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డిచ్పల్లి ఎస్ఐ సురేష్ వెల్లడించారు.