నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి కేసీఆర్ కప్ వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ను అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ప్రారంభించారు. యువతను సామాజిక సేవా రంగాల్లో ప్రోత్సహించేందుకు తెలంగాణ జాగృతి కృషి చేస్తోందని తెలిపారు.
ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు సీఎం శంకుస్థాపన