నిజామాబద్ జిల్లా కేంద్రంలో ఇందూర్ యూత్ సభ్యులు పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుధ పాల్గొని నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ఎంతో మంది పేద ప్రజలకు సాయం చేస్తున్న ఇందూర్ యూత్ని ఆమె అభినందించారు. ఇలాంటి ప్రేరణతో యువత ముందుకు వచ్చి ఆపన్న హస్తం అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రానున్న కాలంలో వీరు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని జడ్జి సుధ యువతకు పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి: తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్జోన్ జిల్లాలివే...