నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్నగర్ సద్గురు దత్తాత్రేయ ఆశ్రమంలో గురువారం కరోనా నివారణ కోసం ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, మంగళహారతులు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వేద మంత్రోచ్ఛారణలతో మారుమోగింది. వ్యవస్థాపకులు హరిదాసు స్వామి, అర్చకులు నాగేశ్వరరావు శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీచూడండి: కరోనా కారణంగా షెడ్డులకే పరిమితమైన ఎంఎంటీఎస్ రైళ్లు