నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని జాతీయ రహదారితో పాటు గ్రామీణ రహదారులపై పంటలు నూర్పిళ్లు చేయొద్దని అవగాహన కల్పిస్తూ బాల్కొండ పోలీసులు బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఎస్సై శ్రీహరి, ఎన్హెచ్ఐ నిర్మల్ బీవోటీ ప్రాజెక్టు మేనేజర్ వెంకటరమణ కలిసి బ్యానర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు.
రహదారిపై మొక్కజొన్నలు, సోయలు, వరి ధాన్యం తదితర పంటలను ఎండ బెట్టడం వల్ల వాహనాలపై వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ప్రమాదాలకు గురవుతున్నారని ఎస్సై శ్రీహరి పేర్కొన్నారు.
జిల్లాలో ఇటీవల కాలంలో రహదారిపై ఆరబెట్టిన పంటల వల్ల పలువురు ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయారన్నారు. రహదారులపై పంటలను ఆరబెడితే కఠిన చర్యలు తీసుకొంటామని ఎస్సై స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : "కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వొద్దు"