ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు కోరారు. ప్రతి శుక్రవారం గ్రీన్ డే నిర్వహించాలన్న మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో విఠల్రావు మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హరితహారంపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేసి... ప్రజలను హరితహారంలో భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:చైనాతో వివాదంపై నేడు ప్రధాని అఖిలపక్ష భేటీ