ETV Bharat / state

భోజన వితరణ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్​ - నిజామాబాద్​ జిల్లా తాజా వార్తలు

కరోనా కట్టడిలో తమ వంతు పాత్ర పోషిస్తోన్న వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్​, రెవెన్యూ, మీడియా సిబ్బందికి లాక్​డౌన్​ ప్రారంభం నుంచి స్థానిక ఎమ్మెల్యే గణేష్​ గుప్తా భోజనం అందిస్తున్నారు. నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో భోజనం పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​ నారాయణ రెడ్డి, సీపీ కార్తికేయ పాల్గొన్నారు.

collector narayanareddy visited food distribution center
భోజన వితరణ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్​
author img

By

Published : Apr 24, 2020, 10:45 AM IST

లాక్​డౌన్​ సమయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి భోజనం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్​ నారాయణ రెడ్డి, సీపీ కార్తికేయ సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే గణేష్​ గుప్తా తన సొంత ఖర్చులతో గత నెల రోజులుగా నిత్యం 1500 మందికి భోజనం పంపిణీ చేయడాన్ని వారు అభినందించారు.

కరోనా కట్టడికోసం పాటుపడుతున్న వారికి తమ వంతు సాయం చేయడానికి అందరూ ముందుకు రావాలని కలెక్టర్​ సూచించారు. అనంతరం కలెక్టర్, సీపీ​ చేతుల మీదుగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి భోజనం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్ దండు నీతూ కిరణ్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్, నూడా ఛైర్మెన్ ప్రభాకర్ రెడ్డి తదితర్లు పాల్గొన్నారు.

లాక్​డౌన్​ సమయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి భోజనం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్​ నారాయణ రెడ్డి, సీపీ కార్తికేయ సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే గణేష్​ గుప్తా తన సొంత ఖర్చులతో గత నెల రోజులుగా నిత్యం 1500 మందికి భోజనం పంపిణీ చేయడాన్ని వారు అభినందించారు.

కరోనా కట్టడికోసం పాటుపడుతున్న వారికి తమ వంతు సాయం చేయడానికి అందరూ ముందుకు రావాలని కలెక్టర్​ సూచించారు. అనంతరం కలెక్టర్, సీపీ​ చేతుల మీదుగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి భోజనం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్ దండు నీతూ కిరణ్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్, నూడా ఛైర్మెన్ ప్రభాకర్ రెడ్డి తదితర్లు పాల్గొన్నారు.

ఇవీచూడండి: ఉరితో ఏడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన చీర ఉయ్యాల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.