ETV Bharat / state

ఆశావర్కర్ల కు నెలకు రూ.10 వేలు ఇవ్వాలి: సీఐటీయూ

author img

By

Published : Jun 25, 2020, 5:21 PM IST

కరోనా మహమ్మారి నియంత్రణ కోసం 70 రోజులుగా పనిచేస్తున్న ఆశా కార్యకర్తలను ఆదుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. వారికి కనీస వేతనంగా పదివేల రూపాయలు ఇవ్వాలని కోరారు.

CITU Leaders demanded for The government should be support the Asha workers in telangana state
ఆశావర్కలను ప్రభుత్వం ఆదుకోవాలి

నిజామాబాద్ జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. వారికి కనీస వేతనంగా రూ.10,000 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విధులు నిర్వహిస్తున్న ఆశావర్కర్లకు అదనంగా రూ.5000 వేతనం ఇస్తున్నారన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశ కార్యకర్తలను ఆదుకోవాలని కోరారు.

కరోనా నియంత్రణకు నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలపై ప్రభుత్వం వెంటనే చొరవ చూపి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. పెండింగ్​లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. అనంతరం ఆరోగ్య శాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు.

నిజామాబాద్ జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. వారికి కనీస వేతనంగా రూ.10,000 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విధులు నిర్వహిస్తున్న ఆశావర్కర్లకు అదనంగా రూ.5000 వేతనం ఇస్తున్నారన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశ కార్యకర్తలను ఆదుకోవాలని కోరారు.

కరోనా నియంత్రణకు నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలపై ప్రభుత్వం వెంటనే చొరవ చూపి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. పెండింగ్​లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. అనంతరం ఆరోగ్య శాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు.

ఇవీ చూడండి: హరితహారంలో కేసీఆర్​.. నర్సాపూర్​ అర్బన్ ఫారెస్ట్​ ప్రారంభించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.