నిజామాబాద్ జిల్లా బోధన్లోని రాకాసిపేట్ 25వ వార్డులో ఉంటున్న ఎల్లమ్మ అనే వృద్ధురాలు ఇల్లు కూలిపోయింది. సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న మున్సిపల్ ఛైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి స్పందించారు. వారిని వేరే ఇంట్లోకి మార్చారు. 25 కిలోల బియ్యం, ఇంటి సరుకులు అందించారు.
25వ వార్డులో ఛైర్మన్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శరత్ రెడ్డి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.