ఎన్డీఏ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు నిజామాబాద్ జిల్లా ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ రాసిన సందేశంతో కూడిన లేఖలను ఇంటింటికి తిరిగి అందించారు.
జిల్లాలోని వేల్పూర్లో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఇంటింటికీ తిరిగి భాజపా ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. మోదీ రాసిన లేఖలను అందించారు. నిజామాబాద్కు కేంద్రం పసుపు బోర్డు కంటే అదనపు ప్రయోజనాలు కల్పించిందని.. ఈ విషయం రైతులకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత యువతపైనే ఉందన్నారు. కొద్దిరోజుల్లోనే దీని ఫలితం కనిపిస్తుందని చెప్పుకొచ్చారు.
ఇదీ చూడండి: జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!