ETV Bharat / state

అంబేడ్కర్‌ జీవితం ఆదర్శనీయం : జిల్లా జడ్జి శ్రీసుధ

author img

By

Published : Apr 14, 2020, 7:29 PM IST

అంబేడ్కర్‌ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని నిజామాబాద్‌ జిల్లా జడ్జి శ్రీసుధ అన్నారు. జిల్లా కోర్టు భవనంలో నిర్వహించిన అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జిల్లా జడ్జి శ్రీ సుధ
జిల్లా జడ్జి శ్రీ సుధ

అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్‌ అని నిజామాబాద్‌ జిల్లా జడ్జి శ్రీసుధ తెలిపారు. అంబేడ్కర్ 129వ జయంతి వేడుకలను జిల్లా కోర్టు భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా జడ్జి శ్రీసుధ పాల్గొని అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన జాతికి చేసిన సేవలను కొనియాడారు. నేటి యువత అంబేడ్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం కరోనా నివారణకు కృషి చేస్తున్న పోలీసు సిబ్బందికి మాస్కులు, శానిటైజర్‌లను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సివిల్ జడ్జి కిరణ్మయి, సీపీ కార్తికేయ, అదనపు డీసీపీ ఉషావిశ్వనాథ్, ఏసీపీ శ్రీనివాస్ కుమార్‌లు పాల్గొన్నారు.

అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్‌ అని నిజామాబాద్‌ జిల్లా జడ్జి శ్రీసుధ తెలిపారు. అంబేడ్కర్ 129వ జయంతి వేడుకలను జిల్లా కోర్టు భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా జడ్జి శ్రీసుధ పాల్గొని అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన జాతికి చేసిన సేవలను కొనియాడారు. నేటి యువత అంబేడ్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం కరోనా నివారణకు కృషి చేస్తున్న పోలీసు సిబ్బందికి మాస్కులు, శానిటైజర్‌లను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సివిల్ జడ్జి కిరణ్మయి, సీపీ కార్తికేయ, అదనపు డీసీపీ ఉషావిశ్వనాథ్, ఏసీపీ శ్రీనివాస్ కుమార్‌లు పాల్గొన్నారు.

ఇవీచూడండి: 'మిమ్మల్ని ఎప్పుడో క్వారంటైన్​లో పెట్టారు... అయినా మీలో మార్పులేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.