రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ ఇవ్వవలసిన రూ.300 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఏఐఎంకేఎస్ కార్యవర్గ సభ్యులు ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు.
తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ రాష్ట్రవ్యాప్తంగా మార్చ్ 2020 నుంచి వేలాది మంది రైతులకు వడ్లు, శనిగలు ఇతర విత్తనాలను సరఫరా చేస్తున్నారని వివరించారు. 3 నెలలుగా రైతులకు సీడ్స్ కార్పొరేషన్ బిల్లులు చెల్లించకపోవటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే బకాయిలు ఇప్పించాలని కలెక్టర్ ను కోరారు.