ETV Bharat / state

ఈ ఎన్నికలు చాలా భిన్నమైనవి... ఎందుకంటే?

author img

By

Published : Mar 26, 2019, 5:27 PM IST

మోదీ పాలనలో కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని వాటిని చూసి... దేశాన్నే అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్​ దీక్షిత్​ ఆరోపించారు. దేశాన్ని నామరూపాల్లేకుండా మారుస్తున్న ప్రధానికి ఈ ఎన్నికలు బుద్ధి చెబుతాయన్నారు.

సందీప్​ దీక్షిత్

గత ఎన్నికలన్నింటిలో కంటే 2019 ఎన్నికలు చాలా భిన్నమైనవన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్​ దీక్షిత్. సాధారణంగా ప్రచార సమయంలో అభివృద్ధి, పేదరిక నిర్మూలన, పథకాలు వంటి వాటి గురించి మాట్లాడేవారు. కానీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా... మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని తెలిపారు. కేవలం కొన్ని కుటుంబాల అభివృద్ధి చూపిదేశాన్ని అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘం, సీబీఐ వంటి సంస్థలను భాజపా తన గుప్పిట్లో పెట్టుకొని నియంత్రిస్తుందని ఆరోపించారు.

ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్​ దీక్షిత్

ఇవీ చూడండి:ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్​ నర్సిరెడ్డి విజయం

గత ఎన్నికలన్నింటిలో కంటే 2019 ఎన్నికలు చాలా భిన్నమైనవన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్​ దీక్షిత్. సాధారణంగా ప్రచార సమయంలో అభివృద్ధి, పేదరిక నిర్మూలన, పథకాలు వంటి వాటి గురించి మాట్లాడేవారు. కానీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా... మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని తెలిపారు. కేవలం కొన్ని కుటుంబాల అభివృద్ధి చూపిదేశాన్ని అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘం, సీబీఐ వంటి సంస్థలను భాజపా తన గుప్పిట్లో పెట్టుకొని నియంత్రిస్తుందని ఆరోపించారు.

ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్​ దీక్షిత్

ఇవీ చూడండి:ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్​ నర్సిరెడ్డి విజయం

TG_NZB_09_26_CONG_SANDIP_DIKSHITH_PC_AVB_R21 Reporter: Srishylam.K, Camera: Manoj (. ) పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ కావడంలో కెసిఆర్ పాత్ర లేదని...ఈ విషయం లో కెసిఆర్ తో బహిరంగ చర్చకు సిద్దమని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ సవాల్ విసిరారు. నిజామాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందన్నారు. వందరోజుల్లో నిజాం షుగర్స్ ను స్వాదీనం చేసుకుంటామని, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని గద్దెనెక్కిన ఎంపి కవిత.. అవే హామీలిస్తూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని.. నిజాం‌ షుగర్స్ తెరిపించి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ సమావేశంలో నిజామాబాద్ లోక్ సభ అభ్యర్థి మధుయాష్కీ పాల్గొన్నారు..... byte.. సందీప్ దీక్షిత్, ఏఐసీసీ అధికార ప్రతినిధి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.