ETV Bharat / state

కంటైనర్​ని దోపిడీ చేసిన దొంగల ముఠా.. డ్రైవర్​పై కత్తులతో దాడి

author img

By

Published : Mar 14, 2023, 4:22 PM IST

Gang of Thieves Robbed a Container: నిర్మల్ జిల్లాలో దొంగల ముఠా హల్​చల్ చేసింది. కంటైనర్​పై దొంగల ముఠా దారి దోపిడీకి పాల్పడ్డారు. కంటైనర్‌ నాగ్‌పుర్‌ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ దోపిడీ చోటు చేసుకుంది. దుండగులు కారులో వచ్చి కంటైనర్‌ను దారి మధ్యలో ఆపి డ్రైవర్​ను గన్​తో బెదిరించి.. కిడ్నాప్ చేసి కత్తులతో దాడికి దిగారు. అనంతరం కంటైనర్​లో ఉన్న సరుకులను లూటీ చేశారు.

Gang of Thieves Robbed a Container
Gang of Thieves Robbed a Container

Gang of Thieves Robbed a Container: నిర్మల్ జిల్లాలో కంటైనర్​ లోడుని దొంగల ముఠా దారి దోపిడీ చేశారు. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి హైదరాబాద్​కు సోమవారం రాత్రి హల్దీరామ్ సరుకులతో వెళ్తున్న కంటైనర్​ను ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ఆవల జాతీయ రహదారిపై ఏడుగురు దుండగులు కంటైనర్​ను ఆపి హైజాక్ చేశారు. దుండగులు.. డ్రైవర్​ను బెదిరించి, కిడ్నాప్ చేసి తమ కారులో ఎక్కించుకొని అతనిపై దాడి చేస్తూ.. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్ వరకు తీసుకెళ్లారు.

అనంతరం డ్రైవర్​పై కత్తులు, రాళ్లతో దాడికి చేశారు. డ్రైవర్​తో పాటు కంటైనర్​ని సైతం అక్కడకి తీసుకెళ్లి అందులోని సరుకులను దొంగలు ఖాళీ చేశారు. అనంతరం గాయాలతో ఉన్న డ్రైవర్​ని కంటైనర్ దగ్గర వదిలేసి పరారయ్యారు. బాధితుడు 100కు డయల్‌ చేయగా బాల్కొండ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దారి దోపిడీపై కేసు నమోదు చేశారు.

దొంగల దాడిలో గాయపడిన డ్రైవర్‌కు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ప్రస్తుతం డ్రైవర్ ఆర్మూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కంటైనర్​లో హల్దీరామ్ సంస్థకు సంబంధించి సరుకు ఉన్నట్లుగా డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో కారులో వచ్చిన ఏడుగురు వ్యక్తుల ముఠా కంటైనర్‌ను ఓవర్‌ టేక్‌ చేసి వాహనం ముందుర ఆపారని చెప్పాడు.

కంటైనర్‌ను ఆపగా కారులో గల వారు కిందికి దిగి డ్రైవర్​కు తుపాకులతో బెదిరిస్తూ.. దాడి చేసి అతనిని సీటులో నుంచి పక్కకు నెట్టినట్టుగా తెలిపాడు. కారులో వచ్చిన వారిలో ఒకరు కంటైనర్‌ వాహనాన్ని నడిపినట్లుగా వెల్లడించాడు. అతనిని కంటైనర్​ నుంచి దించి కళ్లకు గంతలు కట్టి కారులో ఎక్కించినట్లు బాధితుడు తెలిపాడు. కొంచెం దూరం తీసుకెళ్లాకా.. మధ్యలో కంటైనర్‌లో గల రూ.5 లక్షల విలువ చేసే హల్దీరామ్ మూంగ్​దాల్‌ తదితర తినుబండారాలను లూటీ చేశారన్నాడు.

ఇలా 80 కిలోమీటర్ల దూరం వచ్చాకా నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్‌ వద్ద 44వ నంబర్‌ జాతీయ రహదారి పైనే గ్రామ సర్వీస్‌ రోడ్డులో కంటైనర్‌ వాహనంతో పాటు అతనిని తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వదిలి వెళ్లారని తెలిపాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. సుమారు రూ.5 లక్షల విలువైన సరుకు చోరీ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు దారి దోపిడీ ఘటన వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

ఇవీ చదవండి:

Gang of Thieves Robbed a Container: నిర్మల్ జిల్లాలో కంటైనర్​ లోడుని దొంగల ముఠా దారి దోపిడీ చేశారు. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి హైదరాబాద్​కు సోమవారం రాత్రి హల్దీరామ్ సరుకులతో వెళ్తున్న కంటైనర్​ను ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ఆవల జాతీయ రహదారిపై ఏడుగురు దుండగులు కంటైనర్​ను ఆపి హైజాక్ చేశారు. దుండగులు.. డ్రైవర్​ను బెదిరించి, కిడ్నాప్ చేసి తమ కారులో ఎక్కించుకొని అతనిపై దాడి చేస్తూ.. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్ వరకు తీసుకెళ్లారు.

అనంతరం డ్రైవర్​పై కత్తులు, రాళ్లతో దాడికి చేశారు. డ్రైవర్​తో పాటు కంటైనర్​ని సైతం అక్కడకి తీసుకెళ్లి అందులోని సరుకులను దొంగలు ఖాళీ చేశారు. అనంతరం గాయాలతో ఉన్న డ్రైవర్​ని కంటైనర్ దగ్గర వదిలేసి పరారయ్యారు. బాధితుడు 100కు డయల్‌ చేయగా బాల్కొండ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దారి దోపిడీపై కేసు నమోదు చేశారు.

దొంగల దాడిలో గాయపడిన డ్రైవర్‌కు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ప్రస్తుతం డ్రైవర్ ఆర్మూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కంటైనర్​లో హల్దీరామ్ సంస్థకు సంబంధించి సరుకు ఉన్నట్లుగా డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో కారులో వచ్చిన ఏడుగురు వ్యక్తుల ముఠా కంటైనర్‌ను ఓవర్‌ టేక్‌ చేసి వాహనం ముందుర ఆపారని చెప్పాడు.

కంటైనర్‌ను ఆపగా కారులో గల వారు కిందికి దిగి డ్రైవర్​కు తుపాకులతో బెదిరిస్తూ.. దాడి చేసి అతనిని సీటులో నుంచి పక్కకు నెట్టినట్టుగా తెలిపాడు. కారులో వచ్చిన వారిలో ఒకరు కంటైనర్‌ వాహనాన్ని నడిపినట్లుగా వెల్లడించాడు. అతనిని కంటైనర్​ నుంచి దించి కళ్లకు గంతలు కట్టి కారులో ఎక్కించినట్లు బాధితుడు తెలిపాడు. కొంచెం దూరం తీసుకెళ్లాకా.. మధ్యలో కంటైనర్‌లో గల రూ.5 లక్షల విలువ చేసే హల్దీరామ్ మూంగ్​దాల్‌ తదితర తినుబండారాలను లూటీ చేశారన్నాడు.

ఇలా 80 కిలోమీటర్ల దూరం వచ్చాకా నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్‌ వద్ద 44వ నంబర్‌ జాతీయ రహదారి పైనే గ్రామ సర్వీస్‌ రోడ్డులో కంటైనర్‌ వాహనంతో పాటు అతనిని తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వదిలి వెళ్లారని తెలిపాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. సుమారు రూ.5 లక్షల విలువైన సరుకు చోరీ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు దారి దోపిడీ ఘటన వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.