Gang of Thieves Robbed a Container: నిర్మల్ జిల్లాలో కంటైనర్ లోడుని దొంగల ముఠా దారి దోపిడీ చేశారు. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి హైదరాబాద్కు సోమవారం రాత్రి హల్దీరామ్ సరుకులతో వెళ్తున్న కంటైనర్ను ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ఆవల జాతీయ రహదారిపై ఏడుగురు దుండగులు కంటైనర్ను ఆపి హైజాక్ చేశారు. దుండగులు.. డ్రైవర్ను బెదిరించి, కిడ్నాప్ చేసి తమ కారులో ఎక్కించుకొని అతనిపై దాడి చేస్తూ.. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్ వరకు తీసుకెళ్లారు.
అనంతరం డ్రైవర్పై కత్తులు, రాళ్లతో దాడికి చేశారు. డ్రైవర్తో పాటు కంటైనర్ని సైతం అక్కడకి తీసుకెళ్లి అందులోని సరుకులను దొంగలు ఖాళీ చేశారు. అనంతరం గాయాలతో ఉన్న డ్రైవర్ని కంటైనర్ దగ్గర వదిలేసి పరారయ్యారు. బాధితుడు 100కు డయల్ చేయగా బాల్కొండ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దారి దోపిడీపై కేసు నమోదు చేశారు.
దొంగల దాడిలో గాయపడిన డ్రైవర్కు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ప్రస్తుతం డ్రైవర్ ఆర్మూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కంటైనర్లో హల్దీరామ్ సంస్థకు సంబంధించి సరుకు ఉన్నట్లుగా డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో కారులో వచ్చిన ఏడుగురు వ్యక్తుల ముఠా కంటైనర్ను ఓవర్ టేక్ చేసి వాహనం ముందుర ఆపారని చెప్పాడు.
కంటైనర్ను ఆపగా కారులో గల వారు కిందికి దిగి డ్రైవర్కు తుపాకులతో బెదిరిస్తూ.. దాడి చేసి అతనిని సీటులో నుంచి పక్కకు నెట్టినట్టుగా తెలిపాడు. కారులో వచ్చిన వారిలో ఒకరు కంటైనర్ వాహనాన్ని నడిపినట్లుగా వెల్లడించాడు. అతనిని కంటైనర్ నుంచి దించి కళ్లకు గంతలు కట్టి కారులో ఎక్కించినట్లు బాధితుడు తెలిపాడు. కొంచెం దూరం తీసుకెళ్లాకా.. మధ్యలో కంటైనర్లో గల రూ.5 లక్షల విలువ చేసే హల్దీరామ్ మూంగ్దాల్ తదితర తినుబండారాలను లూటీ చేశారన్నాడు.
ఇలా 80 కిలోమీటర్ల దూరం వచ్చాకా నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారి పైనే గ్రామ సర్వీస్ రోడ్డులో కంటైనర్ వాహనంతో పాటు అతనిని తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వదిలి వెళ్లారని తెలిపాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. సుమారు రూ.5 లక్షల విలువైన సరుకు చోరీ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు దారి దోపిడీ ఘటన వివరాల కోసం ఆరా తీస్తున్నారు.
ఇవీ చదవండి: