ETV Bharat / state

కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి

ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు కారులో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఘటన నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని ముజాహిద్​నగర్​లో జరిగింది.

author img

By

Published : Jul 24, 2019, 8:41 AM IST

Updated : Jul 24, 2019, 9:03 AM IST

కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి

నిజామాబాద్​ నగరంలోని ముజాహిద్​నగర్​లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు.. పదేళ్ల రియాజ్, ఐదేళ్ల మహ్మద్ కారులో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. నిన్న మధ్యాహ్నం నుంచి వీరిద్దరూ కనిపించకపోవడం వల్ల కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో కారు వెనుక సీటులో పిల్లలిద్దరూ విగతజీవులుగా కనిపించారు. వారిద్దరూ అక్కాచెల్లెళ్ల కుమారులు కావడం వల్ల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

చిన్నారుల మృతిపై పలు అనుమానాలు...

కారు యజమాని అర్ధరాత్రి డోరు తీయగా పిల్లలు చనిపోయినట్లు గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా వారు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అయితే లాక్​ వేసి ఉన్న కారులోకి పిల్లలు ఎలా వెళ్లారు, అర్ధరాత్రి కార్​ ఓనర్​ ఎందుకు లాక్​ తీసి చూశాడన్న అనుమానాలు కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... శవ పంచనామా నిమిత్తం చిన్నారుల మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి

ఇదీ చదవండిః 'స్వార్థ రాజకీయాలతో ప్రజాస్వామ్యం ఖూనీ'

నిజామాబాద్​ నగరంలోని ముజాహిద్​నగర్​లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు.. పదేళ్ల రియాజ్, ఐదేళ్ల మహ్మద్ కారులో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. నిన్న మధ్యాహ్నం నుంచి వీరిద్దరూ కనిపించకపోవడం వల్ల కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో కారు వెనుక సీటులో పిల్లలిద్దరూ విగతజీవులుగా కనిపించారు. వారిద్దరూ అక్కాచెల్లెళ్ల కుమారులు కావడం వల్ల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

చిన్నారుల మృతిపై పలు అనుమానాలు...

కారు యజమాని అర్ధరాత్రి డోరు తీయగా పిల్లలు చనిపోయినట్లు గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా వారు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అయితే లాక్​ వేసి ఉన్న కారులోకి పిల్లలు ఎలా వెళ్లారు, అర్ధరాత్రి కార్​ ఓనర్​ ఎందుకు లాక్​ తీసి చూశాడన్న అనుమానాలు కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... శవ పంచనామా నిమిత్తం చిన్నారుల మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి

ఇదీ చదవండిః 'స్వార్థ రాజకీయాలతో ప్రజాస్వామ్యం ఖూనీ'

sample description
Last Updated : Jul 24, 2019, 9:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.