పౌష్టికాహార లోపం గల బాలలకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించాలని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు. అలాంటి బాలలను అంగన్వాడీ కేంద్రాల వారీగా గుర్తించి.. అదనపు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సోన్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పౌష్టికాహార లోప బాలల ప్రత్యేక పరీక్ష శిబిరాన్ని పరిశీలించారు. వయస్సుకు తగ్గ బరువు, ఎత్తు లేని వారిని పోషణ, పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.
ఇదీ చూడండి: అపస్మారక స్థితిలో మహిళ.. ఎమ్మెల్సీ కవిత మానవత్వం