ETV Bharat / state

బాసరలో భక్తులపై పిచ్చి కుక్క దాడి - పిచ్చి కుక్క

బాసరలో గోదావరి స్నాన ఘట్టాల​ వద్ద ప్రశాంతంగా సేద తీరుతున్న భక్తులపై పిచ్చి కుక్క దాడి చేసింది. దాడిలో ఇద్దరికి గాయాలు కాగా వారిని వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

dog
కుక్క దాడి
author img

By

Published : Feb 14, 2020, 10:32 PM IST

Updated : Feb 14, 2020, 11:51 PM IST

నిర్మల్ జిల్లా బాసర గోదావరి ఘాట్ వద్ద పిచ్చికుక్క దాడిలో ఇద్దరు భక్తులు గాయపడ్డారు. ఈరోజు సాయంత్రం గోదావరి స్నాన ఘట్టాల వద్ద భక్తులు సేద తిరుతున్న సమయంలో ఆకస్మికంగా పిచ్చి కుక్క దాడి చేసింది.

ఈ దాడిలో విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన భవదీప్​కు, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన దత్తురాం జాదవ్​కు గాయాలయ్యాయి. భవదీప్​కు స్వల్ప గాయాలు కాగా.. దత్తురాం ముఖానికి తీవ్రంగా గాయమైంది. వెంటనే స్పందించిన స్థానికులు వారిని బాసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

నిర్మల్ జిల్లా బాసర గోదావరి ఘాట్ వద్ద పిచ్చికుక్క దాడిలో ఇద్దరు భక్తులు గాయపడ్డారు. ఈరోజు సాయంత్రం గోదావరి స్నాన ఘట్టాల వద్ద భక్తులు సేద తిరుతున్న సమయంలో ఆకస్మికంగా పిచ్చి కుక్క దాడి చేసింది.

ఈ దాడిలో విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన భవదీప్​కు, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన దత్తురాం జాదవ్​కు గాయాలయ్యాయి. భవదీప్​కు స్వల్ప గాయాలు కాగా.. దత్తురాం ముఖానికి తీవ్రంగా గాయమైంది. వెంటనే స్పందించిన స్థానికులు వారిని బాసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

కుక్క దాడి

ఇదీ చదవండి: ఔరా! ఆమె చేతులు అద్భుతాన్ని చేశాయి

Last Updated : Feb 14, 2020, 11:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.