ETV Bharat / state

అన్నం బాలేదన్నందుకు తోటి విద్యార్థులే కొట్టారు - Conflict between students in a government tribal ashram school

నిర్మల్​ జిల్లా రాణాపూర్​లోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల మధ్య కొట్లాట జరిగింది. భోజనం సరిగా లేదని అన్నందుకు సహచర విద్యార్థులు తనపై దాడి చేశారని నందకిశోర్​ అనే బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అన్నం బాలేదన్నందుకు తోటి విద్యార్థులే కొట్టారు
author img

By

Published : Nov 9, 2019, 11:43 PM IST

ఆశ్రమం పాఠశాలలో భోజనం బాగాలేదు అన్నందుకు తోటి విద్యార్థులే కొట్టారంటూ నందకిశోర్​ అనే విద్యార్థి నిర్మల్​ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. నిర్మల్​ జిల్లా రాణాపూర్​లోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న నందకిశోర్​ ఇవాళ భోజనం నాణ్యతగా లేదని ఆరోపించాడు. విషయం తెలుసుకున్న వసతిగృహం సంక్షేమాధికారి ఆగ్రహంతో... సహచర విద్యార్థులతో తనపై దాడి చేయించాడని నందకిశోర్​ ఆరోపించాడు. తోటి విద్యార్థుల దాడిలో కన్నుపై తీవ్ర గాయాలయ్యాయని తెలిపాడు. విద్యార్థి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణకుమార్​ తెలిపారు.

అన్నం బాలేదన్నందుకు తోటి విద్యార్థులే కొట్టారు

ఇదీ చూడండి: 'కాంగ్రెస్​ నాయకులనే టార్గెట్​ చేస్తున్నారు'

ఆశ్రమం పాఠశాలలో భోజనం బాగాలేదు అన్నందుకు తోటి విద్యార్థులే కొట్టారంటూ నందకిశోర్​ అనే విద్యార్థి నిర్మల్​ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. నిర్మల్​ జిల్లా రాణాపూర్​లోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న నందకిశోర్​ ఇవాళ భోజనం నాణ్యతగా లేదని ఆరోపించాడు. విషయం తెలుసుకున్న వసతిగృహం సంక్షేమాధికారి ఆగ్రహంతో... సహచర విద్యార్థులతో తనపై దాడి చేయించాడని నందకిశోర్​ ఆరోపించాడు. తోటి విద్యార్థుల దాడిలో కన్నుపై తీవ్ర గాయాలయ్యాయని తెలిపాడు. విద్యార్థి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణకుమార్​ తెలిపారు.

అన్నం బాలేదన్నందుకు తోటి విద్యార్థులే కొట్టారు

ఇదీ చూడండి: 'కాంగ్రెస్​ నాయకులనే టార్గెట్​ చేస్తున్నారు'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.