నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్కు చెందిన బత్తుల లక్ష్మణ్ అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడ్డారు. 14 రోజుల చికిత్స అనంతరం వైరస్ నుంచి కోలుకున్నాడు. ఈ క్రమంలో పట్టణంలోని సోఫీనగర్కు చెందిన జనార్దన్ అనే వ్యక్తి కొవిడ్తో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల బీ పాజిటివ్ ప్లాస్మా అవసరమవుతుందని వైద్యులు సూచించారు.
స్థానికంగా రక్తదాతల వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తోన్న నిగులపు సంజీవ్ అనే వ్యక్తికి విషయం తెలిసింది. వెంటనే సంజీవ్ లక్ష్మణ్కు సమాచారం అందించాడు. ఇద్దరూ కలసి హైదరాబాద్కు చేరుకుని బాధితుడికి రక్తం అందించారు. లక్ష్మణ్ తన పుట్టినరోజునే ప్లాస్మా దానం చేయడం పట్ల బాధిత కుటుంబ సభ్యులు అతనికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీచూడండి.. మారటోరియం.. ఈఎంఐల భారం తగ్గాలంటే!