నారాయణపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తీసుకొవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, ఎస్పీ చేతన అధికారులకు వివరించారు. ఈ నెల 23నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు కలెక్టర్ వెంకట్రావ్ గుర్తుచేశారు. ఇకమీదట ఎవరైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించకూడదని పేర్కొన్నారు.
పది వేల కన్నా ఎక్కువ డబ్బులను ఓ వ్యక్తి తీసుకెళ్లకూడదని ఎస్పీ చేతన సూచించారు. ఒకవేళ తీసుకెళ్లినా వారి వెంట డబ్బులకు సంబంధించిన రసీదులు, వాటి వివరాలు వెంటబెట్టుకోవల్సిందిగా తెలిపారు. చెక్పోస్ట్ల వద్ద పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. మున్సిపల్ వార్డులో ప్రభుత్వ అనుమతి లేనిదే సభలు, సమావేశాలు నిర్వహించకూడదని వెల్లడించారు.